సాక్షి, అనంతపురం : అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటైంది నందమూరి బాలయ్య పరిస్థితి. హిందూపురం టీడీపీ కంచుకోటగా భావించి ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బాలకృష్ణకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది.
ఈ సారి గడ్డు పరిస్థితి తప్పదని తెలియడంతో తెగ హైరానా పడిపోతున్నారు. పరువు కాపాడుకోవడం కోసం భారీగా డబ్బు ఎర వేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఈనెల 19న నామినేషన్ వేసిన బాలకృష్ణ.. రెండ్రోజులు ప్రచారం చేశారు. ఆ తర్వాత సీమాంధ్రలో ప్రచారం చేసేందుకు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం మే 2న బాలయ్య హిందూపురం రావాల్సి ఉంది. అయితే స్థానిక నేతలు నాలుగు గ్రూపులుగా విడిపోయారు. మూడ్రోజుల క్రితం బాలయ్య తరఫున ప్రచారానికి వచ్చిన తారకరత్న కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో తనకు గడ్డు పరిస్థితి తప్పదని భావించిన బాలయ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం జిల్లాకు వస్తున్న బాలయ్య.. వచ్చీరాగానే హిందూపురంలో ప్రచారంలో పాల్గొంటే ఇతర సంకేతాలు వెళ్తాయన్న భావనతో ముందుగా రాప్తాడు, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించి రాత్రికి హిందూపురం చేరుకోనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులతో పాటు నిన్నమొన్నటి వరకు టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ విజయం కోసం కృషి చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా ఆదిశేషుతో పాటు బీజేపీలో ఉంటూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కక ఇండిపెండెంట్గా పోటీ చేసిన గోపాల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు వెంకటరాముడు, జయప్ప తదితరులు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు.
ఒక్కొక్కరు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుండడంతో నవీన్ నిశ్చల్ విజయావకాశాలు మరింత పెరుగుతున్నాయి. కాగా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు టీడీపీ నేతలు కోస్తా ప్రాంతం నుంచి ఓ బృందాన్ని హిందూపురం పంపి ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు తెలిసింది. పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో తేలడంతో బాలయ్య గుండెల్లో గుబులు పట్టుకున్నట్లు సమాచారం. అందుకే హుటాహుటిన హిందూపురం వస్తున్నట్లు తెలిసింది. కాగా ఎన్నికల వేళ భారీగా డబ్బు పంపిణీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బును హైదరాబాద్ నుంచి హిందూపురానికి ఇటీవల ఓ ట్రాన్స్పోర్ట్ లారీలో చేరవేసినట్లు సమాచారం.
పురం కోటకు బీటలు
Published Fri, Apr 25 2014 3:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement