భువనగిరి ఎంపీ సీటు నాదే: కోమటిరెడ్డి | Sakshi
Sakshi News home page

భువనగిరి ఎంపీ సీటు నాదే: కోమటిరెడ్డి

Published Thu, Mar 27 2014 7:11 PM

భువనగిరి ఎంపీ సీటు నాదే: కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: భువనగిరి ఎంపీ సీటు తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సీట్లు ఎక్కువ ఇవ్వాలని సూచించారు. అలా అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే రాజగోపాల్‌రెడ్డికి సీటు ఇవ్వొద్దని సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలవరకు అభ్యర్థుల పేర్లు ఖరాయినట్టు సమాచారం.

Advertisement
Advertisement