Sakshi News home page

ఓటర్లకు సినీనటుడు శివాజీ హెచ్చరిక!

Published Sun, Apr 20 2014 6:39 PM

శివాజీ - Sakshi

హైదరాబాద్: ఎన్నికల వేళ ఓటర్లకు సినీనటుడు శివాజీ కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. ఓటు అనే ఆయుధాన్ని నోటుతో కొనడానికి  నేతలు సిద్ధమవుతున్నారని శివాజీ ఓటర్లను హెచ్చరించారు.

అమాయక ప్రజలను నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు అనేది హక్కుగా భావించి అందరూ ఓటు వేయాలన్నారు. నోటు ఇచ్చిన నేతలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని  శివాజీ ఓటర్లకు పిలుపు ఇచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement