Sakshi News home page

బాపట్ల వైఎస్‌ఆర్‌ సీపీ లోక్సభ అభ్యర్థి అమృతపాణి

Published Fri, Apr 18 2014 6:28 PM

Doctor Amruthapani named as Bapatla Lok Sabha YSR Congress candidate

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు పెండింగ్లో ఉంచిన స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. బాపట్ల లోకసభ సీటును డాక్టర్ అమృతపాణికి కేటాయించింది.

తూర్పుగోదావరి జిల్లా  పి. గన్నవరం అసెంబ్లీ స్థానానికి కొండేటి చిట్టిబాబు పేరు ఖరారు చేసింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్‌, మార్కాపురం అభ్యర్థిగా జె.వెంకటరెడ్డిలను పోటీకి దింపనున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది. దీంతో సీమాంధ్రలో అన్ని స్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. సీమాంధ్రలో నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుంది.

Advertisement
Advertisement