సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజా తీర్పు మరికొన్ని గంటల్లో రానుంది. 213 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనుంది. తొలుత మడకశిర నియోజకవర్గ ఫలితం రానుండగా.. చివరి ఫలితం కదిరి నియోజకవర్గం కానుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 25 మంది, 14 అసెంబ్లీ స్థానాలకు 188 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 29,81,904 ఓటర్లు ఉండగా.. 23,75,318 మంది ఓటు వేశారు. పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ పార్టీల నేతలు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం అనంతపురం లోక్సభ, ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. హిందూపురం లోక్సభ, ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఎస్కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు.
ఒక్కో రౌండ్కు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. శాసనసభ స్థానాలతో పాటు వాటికి సమాంతరంగా లోక్సభ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కించనున్నారు. రౌండ్లవారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితం ప్రకటిస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్ను అందిస్తారు. ఓట్ల లెక్కింపులో ఒక్కో టేబుల్కు ఒక్కో కౌంటింగ్ సూపర్వైజర్ (గెజిటెడ్ అధికారి), ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి) ఉంటారు. మొత్తం 1344 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఓట్ల లెక్కింపును ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు : డీఎస్
లోకేష్కుమార్, జిల్లా ఎన్నికల అధికారి
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా చేపడతాం. మధ్యాహ్నం రెండు గంటల్లోగా పూర్తి చేస్తాం. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. ఈవీఎంలు మొరాయిస్తే సరిచేయడానికి సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచాం. అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిబంధనలను పాటించాలని సూచిస్తున్నాం.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు :
సెంథిల్కుమార్, ఎస్పీ.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి ప్రతినిధులు మినహా ఎవరినీ అనుమతించం. పాసులు ఉన్న వారు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు రావాలి. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాం. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించాం. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
తీర్పు నేడే
Published Fri, May 16 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement