అధికారం కోసం ఏ గడ్డయినా మేసే రకం | Sakshi
Sakshi News home page

అధికారం కోసం ఏ గడ్డయినా మేసే రకం

Published Wed, Apr 2 2014 2:59 AM

అధికారం కోసం ఏ గడ్డయినా మేసే రకం - Sakshi

చంద్రబాబుపై టీఆర్‌ఎస్ నేత కడియం ఫైర్
 
హన్మకొండ, న్యూస్‌లైన్: అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏ గడ్డి అయినా మేస్తాడని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బాబు నిర్వహించేవి ప్రజాగర్జన సభలు కాదని, ప్రజా వంచన సభలని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకొని.. 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన టీడీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజాగర్జన సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకొని ఘోర తప్పిదం చేశానని అన్న బాబు.. నేడు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న మూర్ఖుడని శ్రీహరి ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement