* ‘స్థానిక’ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్అఫీషియోలపై న్యాయ శాఖ స్పష్టత
* 16 తర్వాత కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
* ప్రమాణ స్వీకారం చేయకున్నా ఓటేయొచ్చు
* చైర్పర్సన్ల ఎన్నికపై తొలగిన సందిగ్ధం
* జూన్ 2 తర్వాత నిర్వహణకే ఈసీ మొగ్గు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణపై న్యాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహిస్తే ఎక్స్అఫీషియో సభ్యులుగా ప్రస్తుతమున్న ఎంపీలకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుందని పేర్కొంది. అయితే రాష్ర్ట శాసనసభ రద ్దయినందున ఎమ్మెల్యేల విషయాన్ని మాత్రం న్యాయశాఖ ప్రస్తావించలేదు. స్థానిక సంస్థలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసి ఫలితాల విడుదలకు సిద్ధమైన ఈసీ.. వాటి చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికపై సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడికానున్న నేపథ్యంలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంలో స్పష్టత కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి ఈసీ గత నెలలో లేఖ రాసింది. ప్రభుత్వం దీనిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈలోగానే రాష్ర్ట శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీల పదవీకాలం ఈ నెల 30 వరకు ఉన్నందున ఆలోగా స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే పాత వారికే ఓటుహక్కు కల్పించాలని న్యాయశాఖ తేల్చింది.
అయితే మున్సిపల్ చట్టాల ప్రకారం స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరోక్ష ఎన్నికల నిర్వహణకు నిర్దేశిత కాలపరిమితేమీ లేదని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులు పాల్గొన్నప్పటికీ వారికి ఓటు హక్కు ఉండదు. మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో మాత్రమే ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిషత్లకు ఎప్పుడైనా పరోక్ష ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మే 16 తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఎమ్మెల్యేలు జూన్ రెండో తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనందున.. అప్పటివరకు పరోక్ష ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.
రాజస్థాన్లో గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేయకున్నా చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని, అదే పద్దతిని ఇక్కడ కూడా పాటించే అవకాశం లేకపోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ విధానంలో ఈ నెల 30లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రస్తుత ఎంపీలు, కొత్త ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. కానీ లోక్సభ ఫలితాలతో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు మాత్రం దూరంగా ఉండాల్సిందే. ఈ వివాదాలన్నింటినీ అధిగమించాలంటే.. జూన్ రెండో తేదీ తర్వాతే పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే మేలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత స్థానిక సంస్థల పాలకమండళ్లకు పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది.
30లోగా పాత ఎంపీలకే చాన్స్
Published Fri, May 9 2014 4:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement