'రాయచోటి ప్రజల రుణం తీర్చుకుంటా' | Sakshi
Sakshi News home page

'రాయచోటి ప్రజల రుణం తీర్చుకుంటా'

Published Fri, May 16 2014 6:35 PM

Gadikota srikanth reddy win rayachoti

రాయచోటి : ఎంతో నమ్మకంతో తనను గెలిపించిన రాయచోటి ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి కోసం రాయచోటి ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు శక్తిమేరా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలకు రవీంద్రనాథ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్‌ఆర్‌ సీపీ రేయింబవళ్లు కృషి చేస్తుందని చెప్పారు.

 

Advertisement
Advertisement