తెలుగుదేశం పార్టీ కదిరి అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ క్రైస్తవుల కోసం కమ్యూనిటీ హాల్ కట్టించారని ఆయన అనుచరులు కొందరు పదే పదే చెప్పి క్రైస్తవుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కందికుంట డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని తెలిసింది. క్రైస్తవుల విరాళాలతోనే నిర్మించి అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యే కందికుంట నిధులు రూ 2 లక్షలు, ఎంపీ నిమ్మల నిధులు రూ 3 లక్షలు దీనికి తోడు కందికుంట సొంత నిధులు మరో రూ.10 లక్షలు అని శిలాఫలకం చెక్కించారు. కానీ అక్కడ కనీసం సీఅండ్ఐజీ చర్చి బోర్డు కూడా పెట్టలేదు. కందికుంట చర్చి ఆస్తులు మింగేసిన విషయం వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు తెలుస్తోంది.
కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఅండ్ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన సర్వే నెం.660-3లోని రూ. కోట్ల విలువ చేసే క్రైస్తవ విద్యార్థుల ఆశ్రమ పాఠశాల ఉన్న 15 సెంట్ల స్థలాన్ని కందికుంట తన బినామీల పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ం దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి తన చేత రాయించుకున్నారని సీఅండ్ఐసీ మిషన్ చర్చి ఫాదర్గా ఉన్న ఎం.జేమ్స్ జిల్లా కోర్టులో కూడా చెప్పినట్లు తెలిసింది. వాస్తవంగా ప్రభువు ఆస్తులు అమ్మడానికి తనకు ఏ మాత్రం అధికారాలు లేవని, వారి బలవంతం.. బెదిరింపులకు భయపడే రాయించానని కూడ కోర్టు ఎదుట చెప్పినట్లు సమాచారం. తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈ మనోవేదనతోనే చనిపోయాడని కొందరు క్రైస్తవ పెద్దలు చెప్పుకుంటున్నారు.
అప్పులోళ్ల గోడు వినేదెవరు?
కందికుంట తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంకా పలుచోట్ల రూ కోట్ల అప్పులు తీసుకున్నారు. ఈ మధ్యే ఒకరు తన అప్పు ఇస్తావా? లేదా అంటూ ఆయన ఇంటి పైకి రాళ్లు కూడా రువ్వి నానా హంగామా చేసిన విషయం చర్చనీయాంశమైంది. నల్లచెరువు, గాండ్లపెంట మండలానికి చెందిన ఆ పార్టీకే చెందిన మండల నాయకులు ఇద్దరు కందికుంటతో వారికున్న డబ్బు లేవాదేవీల కారణంగానే ఆ పార్టీని వీడలేకున్నారని, లేదంటే వారు ఎప్పుడో వైఎస్సార్సీపీలో చేరిపోయే వారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కందికుంట అప్పుల బాధితులకు చివరికి ఆత్యహత్యే శరణ్యమని వారంటున్నారు.
మైనార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు హాంఫట్!
కదిరి-అనంతపురం జాతీయ రహదారి పక్కనే రూ కోట్ల రూపాయలు విలువ చేసే ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా కందికుంటతో పాటు ఆయన అనుచరులు కబ్జా చేశారన్న విమర్శలు పట్టణంలో వినబడుతున్నాయి. దీనిపై గతంలోఎంఐఎం నాయకులు, కొందరు మైనార్టీ సోదరులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు కూడా చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్థులను రక్షించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు అప్పట్లో డిమాండ్ చేశారు.
డీడీల స్కాం
కందికుంటపై నకిలీ డీడీల స్కాం కేసు ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ విషయం ఆయనే స్వయంగా తన అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు. తనపై 9 కేసులున్నాయని అందులో ఇది కూడా ఒక్కటని ఆయనే ఒప్పుకున్నారు. ఇంకా ఇతనిపై ఐపీసీ సెక్షన్ 420, 302, 307, 324, 375, 471, 147, 148, 149 ఇలా పలు సెక్షన్ల కింద కేసులున్నట్లు ఆయన నామినేషన్తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ బట్టబయలు చేస్తోంది.
కబ్జాలకు మారు పేరు
Published Sun, May 4 2014 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement