సాక్షి, కడప : జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు ఊపందుకున్నాయి. మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం నాటికి జోరందుకుంది. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు 29, కడప పార్లమెంటుకు 3 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. నామినేషన్లు వేసేందుకు ఇక రెండు రోజులు అంటే 17, 19 తేదీలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప లోక్సభ స్థానానికి బుధవారం మధ్యాహ్నం వైఎస్ అవినాష్రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రకాశ్రెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఉన్నారు.
కలెక్టర్ కోన శశిధర్ వైఎస్ అవినాష్రెడ్డిచే ప్రమాణం చేయించారు. ఈనెల 19వ తేదీన మళ్లీ అట్టహాసంగా వైఎస్ అవినాష్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఇప్పటికే ఈనెల 15వ తేదీన వైఎస్ అవినాష్రెడ్డి తరుపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలుచేశారు. కడప లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి తరుపున గోవర్దన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అట్టహాసంగా అసెంబ్లీ నామినేషన్లు
బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయరాములు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో మార్కెట్యార్డు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జయరాములు నామినేషన్ దాఖలు చేశారు.
రాజంపేటలో మన్నూరు పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మిథున్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్బాబు, పోలా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో వైఎస్ అతిథి గృహంనుంచి టోల్గేట్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిపి వైఎస్సార్సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట లోక్సభ అభ్యర్థి మిథున్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సుకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా...
ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్తియార్, ఈవీ సుధాకర్రెడ్డి, జింకా విజయలక్ష్మి, నారాయణరెడ్డిలతో కలిసి మధ్యాహ్న సమయంలో నామినేషన్ దాఖలు చేశారు.
మైదుకూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్రెడ్డితో కలిసి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.
రాయచోటిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, గడికోట మోహన్రెడ్డితోపాటు నేతలు బషీర్ఖాన్,సలావుద్దీన్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తరుపున ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తనయుడు సుబ్బరామిరెడ్డి (భూపేష్) నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ అభ్యర్థులుగా..
తెలుగుదేశం పార్టీ తరుపున రాయచోటిలో రమేష్రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకర్యాదవ్, జమ్మలమడుగులో పి.రామసుబ్బారెడ్డి నిరాడంబరంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు కడప లోక్సభకు ఐదు, అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా 18వ తేదీ గుడ్ఫ్రైడే కారణంగా సెలవు ఉండడంతో నామినేషన్ల దాఖలుకు 17, 19 తేదీలు రెండురోజులే గడువు ఉండడంతో ఆ రోజుల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
నామినేషన్ల జోరు
Published Thu, Apr 17 2014 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement