‘ఎకానమిస్ట్’ పత్రిక వ్యాఖ్య
భారతీయులు రాహుల్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి
అది స్ఫూర్తినివ్వకపోయినా తక్కువ అశాంతికరమైంది
వాషింగ్టన్: లండన్ నుంచి వెలువడే ప్రతిష్టాత్మక పత్రిక ‘ది ఎకానమిస్ట్’ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇబ్బందిపడే వ్యాఖ్యలు చేసింది. ‘భారత్కు మోడీ కంటే మెరుగైన నేత కావాలి’ పేరుతో ఈ నెల 5న వెలువడే సంచికలో ఒక వ్యాసం ప్రచురించింది. మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన విభజనకారుడని, భారత్వంటి సున్నితమైన దేశానికి ప్రధాని కావడం సరికాదని పేర్కొంది.
భారతీయులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, అది ఏమాత్రం స్ఫూర్తిదాయకమైనది కాకపోయినా తక్కువ అశాంతికరమైందని వ్యాఖ్యానించింది. ‘రాహుల్ సంకీర్ణ కూటమిపై అవినీతి మచ్చపడింది. దీనితో పోలిస్తే మోడీ మచ్చలేని వ్యక్తే. అభివృద్ధికాముకుడని నిరూపించుకున్నారు.
ఇది మెచ్చుకోదగిందే. అయినప్పటికీ భారత ఉన్నత పదవికి మోడీ పేరుకు మేం మద్దతివ్వడం లేదు’ అని పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల కారణంగానే ఆయనకు అభ్యంతరం చెబుతున్నామని వివరించింది. ఈ అల్లర్ల కేసులో ఆయనకు సుప్రీం కోర్టు నియమిత దర్యాప్తు కమిటీ ఇచ్చిన క్లీన్ చిట్ను తాము పట్టించుకోవం లేదని, దర్యాప్తులు కొలిక్కి రాకపోవడానికి సాక్ష్యాలు కనుమరుగవడం, వాటిని నాశనం చేయడం కారణమని పేర్కొంది.
మోడీ అల్లర్లలో తన పాత్రపై వివరణ ఇచ్చి, నిజాయతీగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఆయనకు మద్దతుపై ఆలోచిస్తామని, అయితే ఆయనెప్పుడూ ఆ పని చే యలేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని మిత్రపక్షాలు మోడీని కాకుండా మరొకరిని ప్రధాని ఎన్నుకోవాలని సూచించింది. ఈ వ్యాసంపై బీజేపీ మండిపడింది. పత్రికకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియదని విమర్శించింది.
మోడీకంటే మెరుగైన నేత కావాలి
Published Sat, Apr 5 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement