ప్రజాస్వామ్యంపై అవహేళనంటూ వ్యాఖ్యలు
కోర్టులో పిటిషన్కు సిద్ధం
నిబంధనలు పాతవే : గోపాలస్వామి
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఎన్నికల సమయంలో సాధారణంగా అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం సాగుతుంది. రాష్ట్రంలో మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, ఎన్నికల కమిషన్ మధ్య మొదలైన వాగ్యుద్ధం కోర్టులో పిటిషన్ వేసే దశకు చేరింది. ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చును ఖచ్చితంగా లెక్కకడుతున్న ఎన్నికల కమిషన్ ప్రచారవేదికలపై దృష్టి సారించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై అభ్యర్థితోపాటు పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ నేత ఉన్నపక్షంలో ఆ సభకు పెట్టిన ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి చేరుతుందని ప్రకటించింది. ఈ ప్రకటనపై జయలలిత తీవ్రంగా మండిపడ్డారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల పేరుతో కమిషన్ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలు తమ అభిమాన నేతల కోసం వేదిక, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితరాలు ఏర్పాటు చేయడం సహజమని పేర్కొన్నారు. 1952లో తొలి ఎన్నికల నుంచి అన్నాదురై, ఎంజీఆర్ తదితరుల హయూంలో కూడా అదే పంథా కొనసాగిందని చెప్పారు. 2014లో మాత్రం ఎన్నికల కమిషన్ నిబంధనల పేరుతో విపరీ త ధోరణికి పోతోందని విమర్శించారు. ప్రజ లు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనను సైతం స్తం భింపజేస్తోందని దుయ్యబట్టారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తున్నట్టు భావిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల కమిషన్ చర్యలను నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జయలలిత ప్రకటించారు. నిబంధనలు పాతవే: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముందుగా ఈసీ ప్రవేశపెట్టిన నియమ నిబంధనలను తెలుసుకోవాలని మాజీ ప్రధా న ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి తెలి పారు. నేతల అవగాహన లేమి అధికారుల తప్పు కాదని వ్యాఖ్యానించారు. ఓటర్ల చైతన్యం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెన్నై మెరినా బీచ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభిం చారు. మూడు రోజులు కొనసాగే ఈ ప్రదర్శ న ద్వారా ఓటు ప్రాధాన్యత, ఓటుకు నోటు కూడదు, పార్టీకి ఓటు వేయగానే ఏ పార్టీకి పడిందో ఈవీఎంలో చూసి తెలుసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ సందర్భంగా జయ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎన్నికల నిబంధనలు కొత్తవేమీ కాదన్నారు. 1975 నుంచి ఉన్నవేనని బదులిచ్చారు. ప్రచార వేదికల ఖర్చును అభ్యర్థిపై మోపడం సరికాదనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నిబంధనలు ఉన్న సంగతిని అభ్యర్థులు, పార్టీ అధినేతలు తెలుసుకోకపోవడం వారి తప్పని వివరించారు. ఈ అంశంలో ఈసీని తప్పుబట్టడం సరికాదన్నారు.
రాత్రి 10 గంటల తర్వాత కూడా ప్రచారం చేసుకోవచ్చని ఈసీ ప్రకటించడాన్ని మీడియా ప్రశ్నించగా అభ్యర్థులు ఒంటరిగా వెళ్లి ఓటరును కలిసి ఓటు అభ్యర్థించుకోవచ్చన్నారు. రాత్రి వేళ ఇబ్బందిపెడుతూ ప్రచారం చేసినప్పుడు ప్రజలు దాడి చేస్తే దెబ్బలు తిన క తప్పదని, ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కారని ఆయన హెచ్చరించారు.
ఈసీపై జయ ఫైర్
Published Fri, Apr 4 2014 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement