కరప, న్యూస్లైన్ : కాకినాడ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధిగా కేంద్ర మాజీమంత్రి పీవీ రంగయ్యనాయుడు కుమారుడు సీతారామస్వామి నాయుడు పేరు పరిశీలిస్తున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఈ చర్య ద్వారా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు కాంగ్రెస్ పార్టీ జెల్ల కొట్టిందని అంటున్నారు. కన్నబాబును మారిస్తే అదే సామాజిక వర్గంనుంచి మరొకరిని పోటీ చేయించే పట్టుదలతో ఉన్న కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు పీవీ సీతారామస్వామినాయుడు పేరును తెరపైకి తెచ్చారు. మొదట్లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబును ఏదోవిధంగా ఒప్పించి కాంగ్రెస్ తరఫున పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే కన్నబాబు మరోపార్టీలో చేరి సీటు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీల్లో ఈ ప్రయత్నాలు గండికొట్టాయి. దీంతో ఆది, సోమవారాల్లో కన్నబాబు కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్ నుంచి పోటీచేయాలా, స్వతంత్రంగా పోటీచేయాలా అని తర్జనభర్జన పడ్డారు. చివరికి కాంగ్రెస్నుంచి పోటీకి నిర్ణయించుకుని అధిష్టానానికి తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇచ్చిన గడువు అప్పటికే ముగియడంతో టికెట్ నిరాకరించినట్టు సమాచారం. దీంతో మరో దారి లేక ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు కన్నబాబు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో కేంద్రమంత్రి చిరంజీవి ఆఖరి క్షణం వరకూ కన్నబాబుకు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర ప్యానల్ అభ్యర్థులను నిలబెట్టి పార్టీని నిర్వీర్యం చేసిన కన్నబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని కేంద్రమంత్రి పళ్లంరాజు ప్రశ్నించడంతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలు కన్నబాబుకు టికెట్ నిరాకరించారని అంటున్నారు. దీంతో అదే సామాజికవర్గం నుంచి సీతారామరామస్వామినాయుడును పళ్లంరాజు తెరపైకి తెచ్చారు.
కన్నబాబుకు కాంగ్రెస్ ఝలక్
Published Thu, Apr 17 2014 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement