తెలంగాణను సింగపూర్ చేసుకో.. హైదరాబాదును సీమాంధ్రకు వదిలెయ్ | Sakshi
Sakshi News home page

తెలంగాణను సింగపూర్ చేసుకో.. హైదరాబాదును సీమాంధ్రకు వదిలెయ్

Published Sun, May 4 2014 12:11 AM

తెలంగాణను సింగపూర్ చేసుకో.. హైదరాబాదును సీమాంధ్రకు వదిలెయ్ - Sakshi

చంద్రబాబుకు జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ సూచన
 
 ఏలూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కోసం రెండుసార్లు కేంద్రానికి లేఖలు ఇచ్చి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సింగ్‌పూర్ చేస్తానడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోటీడీపీ సీఎం అభ్యర్థిని నిలబెట్టి అక్కడే పుట్టిన రోజు వేడుక చేసుకున్న చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని సింగపూర్ చేసుకుని హైదరాబాద్‌ను సీమాంధ్రకు వదిలి వేయాలని సూచించారు.

 

సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చించటానికి కూడా ఇష్టపడని బాబు ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను నమ్మి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement