సాక్షి ప్రతినిధి, విజయనగరం : అందరిలో ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులైతే నరాలు తెగేంత టెన్షన్తో ఉన్నారు. క్షణమొక యుగంగా గడుపుతున్నారు. గురువారం రాత్రి చాలామందికి కంటిమీద కునుకులేకుండా పోయింది. ఎంత వేగంగా తెల్లవారుతుందా అని ఎదురు చూశారు. మొత్తానికి తొమ్మిది రోజులు గా వేచి చూస్తున్న లెక్కింపు రోజు వచ్చేసింది. ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమయింది. మరికొన్ని గంటల్లో గెలిచేదేవరో, ఓడేదెవరో తేలిపోనుంది.
11.30 గంటలకు తొలి ఫలితం
ఉదయం 11.30 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కురుపాం నియోజకవర్గంలో పోలైన ఓట్లను 14 రౌండ్లలో లెక్కించనున్నారు. ఈ నియోజకవర్గ ఫలితం మొట్టమొదట వెల్లడి కానుంది. ఆ తర్వాత పార్వతీపురం ఫలితం రానుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 16 నుంచి 17రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మొత్తానికి మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రతి నియోజకవర్గంలో 14 నుంచి 16 టేబుళ్లగా విభజించి లెక్కింపు చేపడుతున్నారు. వెన్నుపోటు రాజకీయాలు అభ్యర్థులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దాదాపు ప్రతి పార్టీలోను వెన్నుపోటు దారులుండడంతో ఆయా పార్టీలు మునుపెన్నడూలేని ఆందోళనతో ఉన్నాయి. కొంతమంది నాయకులైతే బహిరంగంగానే క్రాస్ ఓటింగ్కు పిలుపునిచ్చారు. ఒక ఓటు అటు, మరోటి ఇటు అంటూ ఓటు వేయడానికి వెళ్లే ముందు ఓటర్లను ప్రభావితం చేశారు. క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎవరికి వేయాలనుకుని ఎవరికి వేసేశారోనన్న బెంగ ప్రతి అభ్యర్థిలోనూ నెలకొంది. బయటొకటి చెప్పి లోపల ఇంకొకటి చేసిన వారు చాలామంది ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ చోటు చేసుకుంది. క్రాస్ ఓటింగ్ ప్రోత్సహించిన వారి గురించి ఆలస్యంగా తెలుసుకున్నా అంతా అయిన తరువాత ఇప్పుడేం చేయగలమన్న అభిప్రాయంతో అభ్యర్థులు నిస్సహాయులుగా ఉండిపోయారు.
ఒక వైపు కౌంటింగ్ సమయం ముంచుకొస్తుండడం, మరో వైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ప్రతి ఒక్కరిలోనూ ఏదొక మూలన భయం వెంటాడుతోంది. తమకు వచ్చే ఓట్ల గురించి ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకుంటున్నారు. బూత్ల వారీగా వచ్చే ఓట్లు విషయంలో మళ్లీ అంచనాలు వేసుకున్నారు. గెలుపోటములపై బేరీజు కట్టారు. నిశ్శబ్ద ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో అంచనాలు అంతుచిక్కడం లేదు. జిల్లాలో హేమాహేమీలు పోటీచేశారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన వైరిచర్ల కిషోర్చంద్రదేవ్, విజయనగరం జిల్లాలో తొలి మహిళా ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీలక్షి్ష్మ, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిైకైన పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన పతివాడ నారాయణస్వామినాయుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇండిపెం డెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి, హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న సుజయ్కృష్ణరంగారావు, పీడిక రాజన్నదొర, తొలి ప్రయత్నంలో ఎంపీగా పోటీ చేసిన బేబినాయన, ఎమ్మెల్యేగా పోటీ చేస్తు న్న బెల్లాన చంద్రశేఖర్, పాముల పుష్పశ్రీవాణి, డాక్టర్ సురేష్బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, కిమిడి మృణాళిని, రొంగలి జగన్నాథం తదితరుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో టీడీపీ వృద్ధనేత కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలితకుమారి, గజపతినగరం వంగపండు ఫ్యామిలీకి చెంది న కడుబండి శ్రీనివాసరావు తలరాత ఏంటో తేలబోతోంది.
ఓటు గుట్టు వీడేది నేడే
Published Fri, May 16 2014 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement