పవార్ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

పవార్ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

Published Mon, Mar 24 2014 11:10 AM

పవార్ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  మహారాష్ట్రలో మూడు విడతలుగా జరగనున్న లోక్‌సభ ఎన్నికలను అవకాశంగా తీసుకొని ఒక్కొక్కరూ రెండుసార్లు ఓట్లు వేయాలంటూ ఆదివారం మథాడీ కార్మికుల సదస్సులో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. సరదాకే ఆ మాటలన్నానంటూ పవార్ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. కాగా దీనిపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. శరద్ పవార్ వీడియో ప్రసంగాన్ని ఈసీ పరిశీలించనుంది. ఈ మేరకు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్... పవార్ ప్రసంగ సీడీని సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

Advertisement
Advertisement