ఎన్నికల్లో మావోయిస్టుల విధ్వంసం | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో మావోయిస్టుల విధ్వంసం

Published Thu, Apr 10 2014 11:26 AM

ఎన్నికల్లో మావోయిస్టుల విధ్వంసం - Sakshi

ఒడిషాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులు ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా, పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత భద్రత ఏర్పాటుచేసినా కూడా.. తమ ఉనికిని చాటుకున్నారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న మల్కన్గిరి జిల్లా మత్తిలి సమీపంలో ఒక పోలింగ్ కేంద్రంపై వారు దాడి చేశారు. మహుపొదర్ అనే ప్రాంతంలో ఉన్న కేంద్రంపై దాడిచేసి, ట్రక్కుకు నిప్పంటించి, నాలుగు ఈవీఎంలను ఎత్తుకెళ్లిపోయారు. అలాగే, బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఆరు మందుపాతరలను పేల్చారు. అయితే అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం భారీ సంఖ్యలోనే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజలు ఓట్లు వేయడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మావోయిస్టుల బెదిరింపులు ఓటర్లకు అడ్డం కావని ఓ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారిణి ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement