‘వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు’ | Sakshi
Sakshi News home page

‘వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు’

Published Wed, Apr 2 2014 8:59 PM

‘వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు’ - Sakshi

గురజాల: నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచే తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నారు. గుంటూరు జిల్లా గురజాలలో విలేకరులతో మాట్లాడారు.

మాచర్ల పురపాలక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసి, అధికారిని అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పి.లక్ష్మారెడ్డిని జైల్లో పెట్టించారని, దొంగ ఓటు వేసినవారు బయట తిరుగుతున్నారన్నారు. దాన్ని అడ్డుకున్న లక్ష్మారెడ్డిని జైలుకు పంపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

Advertisement
Advertisement