హిందూపురం: టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై సినీ నటుడు తారకరత్న మీడియా ఎదుట తడబడ్డారు. బాబాయ్ అని... అంతలోనే కాదుకాదు మామయ్య అని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించడానికి మంగళవారం ఉదయం ఆయన ఇక్కడికొచ్చారు. ఇక్కడి టీడీపీలో నాలుగు వర్గాలున్న నేపథ్యంలో ఎవరూ రోడ్ షోకు అనుమతి తీసుకోలేదు. దీంతో లాడ్జికే పరిమితమైన తారకరత్న.. మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ బాలకృష్ణను సీఎంగా చూడాలని ఉందని చెప్పారు.
మరి చంద్రబాబు సంగతేంటని విలేకరులు ప్రశ్నించే సరికి.. చంద్రబాబు సీఎం కావాలన్నారు. అదేంటి ఇద్దరి పేర్లు చెబుతున్నారని అడిగితే, టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి విషయం గురించి బాబాయ్ బాలకృష్ణ, మావయ్య చంద్రబాబు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారని సమాధానమిచ్చారు. తారకరత్న సమాధానాలు విన్న టీడీపీ నేతలు.. ఇక ముగించండంటూ సైగలు చేశారు. పోలీసులు చివరకు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో కాసేపు ఆయన రోడ్ షో నిర్వహించగా జనం లేక వెలవెలబోయింది.
Breadcrumb
సీఎంగా బాబాయ్.. కాదు మావయ్య
Published Wed, Apr 23 2014 6:02 PM
Related news
-
పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామర్నే నమ్ముకుని ఛాన్సులు కొట్టేస్తుంటారు. గతంలో అవసరం బట్టి సినిమాల్లో మాత్రం అందాల ఆరబోత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. అయితే అలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి మాళవిక ఆసక్తికర సమాధానమిచ్చింది.(ఇదీ చదవండి: )తరచూ గ్లామరస్ దుస్తుల్లో స్పెషల్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం గురించి తనని అడుగుతున్నారని చెప్పిన మాళవిక.. గ్లామర్ అంటే ఇష్టమని, అందుకే అలాంటి దుస్తులు ధరిస్తున్నట్లు చెప్పారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని.. తనను పెళ్లికూతురు దుస్తుల్లో చూడడానికి మీకెందుకో అంత ఆసక్తి అని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు.మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన మాళవిక.. రజనీకాంత్ 'పేట' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్, మారన్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్రమ్ 'తంగలాన్'లో చేసింది. ఇది త్వరలో విడుదల కానుంది. అలానే తెలుగులో ప్రభాస్ సరసం 'రాజా సాబ్' మూవీలో ఓ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ) -
అల్లూరికి అర్ధ శతాబ్దం
‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్లో స్కెచ్తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్ వాహినీ స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్లు లేకపోవడంతో యూనిట్లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసేందుకు రెండే లెన్స్లు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్కి కెమెరా వ్యూఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు. అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్ హిట్. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా, ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్ల్యాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’ తీయను’’ అన్నారు ఎన్టీఆర్.మహారథి చేతికి స్క్రిప్ట్ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. -
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాక్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరణ్మనై-4తో వస్తోన్న ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో తమన్నా, రాశి ఖన్నా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఓ హాలీవుడ్ ఫిల్మ్ని చూశాక వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం) మానేశానని తెలిపారు. హాలీవుడ్ చిత్రం హౌజ్ ఆఫ్ వ్యాక్స్ చిత్రంలో వ్యాక్స్తోనే పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాకే వ్యాక్సింగ్ మానేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. రాశి ఖన్నాతో కలిసి వేదికపై మెరిసింది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటేడ్ సిరీస్ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబలి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024 -
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024
Related News by category
-
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
Advertisement