'కాంగ్రెస్కి ఓటేయమంటే టీఆర్ఎస్కి వేసేశాడు' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్కి ఓటేయమంటే టీఆర్ఎస్కి వేసేశాడు'

Published Wed, Apr 30 2014 1:30 PM

old woman protest in karimnagar district

కరీంనగర్ : తాను ఓ పార్టీకి ఓటు వేయమంటే ఎన్నికల అధికారి మరో పార్టీకి ఓటు వేశాడంటూ ఓ వృద్ధురాలు ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రాయకల్ మండల కేంద్రంలోని 25వ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. అయితే ఈవీఎం యంత్రంపై అవగాహన లేని ఆమె అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి సాయం కోరింది. ఈ సందర్భంగా వృద్దురాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పగా, అధికారి టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లు సమాచారం. దాంతో వృద్ధురాలు ఆందోళనకు దిగింది.

 

Advertisement
Advertisement