తోటకు బోస్ సవాల్
ద్రాక్షారామ, న్యూస్లైన్ : ‘రామచంద్రపురం నియోజకవర్గంలో నేను ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే అసెంబ్లీ ఎన్నికల పోటీనుంచి తప్పుకుంటా.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు సవాల్ విసిరారు. ఆయన బుధవారం రాత్రి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్తో కలసి ద్రాక్షారామలో ప్రచారం నిర్వహించారు. తాను చేసిన పనులను తోట త్రిమూర్తులు ఖాతాలో వేసుకోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల కాలంలో నేను చేసిన అభివృద్ధి త్రిమూర్తులు ఏడాదిన్నర కాలంలోనే చేసినని చెప్పుకుంటున్నారు. ఆయన దాన్ని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అన్నారు. ఇసుక మాఫియా, కుల రాజకీయాలను రెచ్చగొట్టడం సంస్కారం కాదని ఆయన తోటకు హితవు పలికారు. రామచంద్రపురం పట్టణంలోని మెయిన్ రోడ్డు, రాజీవ్ గృహకల్ప, బైపాస్ రోడ్డు, జూనియర్ కాలేజీ అభివృద్ధి, కాలేజీ గ్రౌండు అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
‘నేను కట్టించిన కమ్యూనిటీ హాళ్లు, వేయించిన సీసీ రోడ్లను తాను చేసిన అభివృద్ధిగా త్రిమూర్తులు చెప్పుకుంటున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను ఆయన మానుకోవాలి’ అని హెచ్చరించారు. లేకుంటే ఆగ్రహించిన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొత్తూరులో పేదవారి కోసం 33 ఎకరాలను పట్టాలుగా ఇస్తే అవి దొంగ పట్టాలంటూ ప్రచారం చే స్తున్న నీకు అక్షరం జ్ఞానం ఉందా అని బోస్ తోటను ప్రశ్నించారు. ‘నకిలీలు ఏవో ఒరిజినల్ పట్టాలు ఏవో నీకు తెలియదు. నేను చేసిన అభివృద్ధి నాది కాదు అని కాని, నేను పంపిణీ చేసిన పట్టాలు నకిలీవి అని నువ్వు నిరూపిస్తే నేను నీకు బానిసగా ఉంటాను’ అని ఆయన అన్నారు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగించాలని చూస్తే వారు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే తప్పుకుంటా:పిల్లి సుభాష్ చంద్రబోస్
Published Thu, May 1 2014 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement