ఓటర్లలో చైతన్యం పెంపొందించాలి | Sakshi
Sakshi News home page

ఓటర్లలో చైతన్యం పెంపొందించాలి

Published Thu, Mar 20 2014 1:50 AM

Promote awareness of voters

 సాక్షి, కాకినాడ : ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ఓటర్లకు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ డెరైక్టర్ జనరల్ ఏవీ రావు పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కలిసి ఆయన బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల నమోదు, జాబితాల ప్యూరిఫికేషన్‌ను సమర్ధవంతగా పూర్తిచేసిన కలెక్టర్లను అభినందించారు.
 
  తక్కువ శాతం పోలింగు నమోదవుతున్న క్రమంలో ఎన్నికల కమిషన్ పోలింగు సమయాన్ని పెంచిందని ఆయన తెలిపారు.  ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందన్నారు. పోలింగ్ వేళలు పెరిగిన విషయాన్ని ఓటర్లకు తెలిపి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 2.5 లక్షల ఓటర్లను నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement