పురందేశ్వరికి బీజేపీ ప్రచార బాధ్యతలు | Sakshi
Sakshi News home page

పురందేశ్వరికి బీజేపీ ప్రచార బాధ్యతలు

Published Sun, Mar 23 2014 2:07 AM

పురందేశ్వరికి  బీజేపీ ప్రచార బాధ్యతలు - Sakshi

 25నుంచి ప్రచారం ప్రారంభం

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమిస్తున్నట్టు అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు శనివారం వెల్లడించారు. ఈనెల 25 నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. తనతో పాటు నటుడు కృష్ణంరాజు, రాష్ట్ర పదాధికారులంతా కలసి పర్యటిస్తారన్నారు.

Advertisement
Advertisement