అనంతపురం కలెక్టరేట్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. స్థానిక ఈవీఎం గోదాము వద్ద ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు కేటాయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 3,334 పోలింగ్ కేంద్రాలుండగా, 6,668 ఈవీఎంలు అవసరం కాగా, 9 శాతం రిజర్వుతో కలిపి రాయదుర్గం 534, ఉరవకొండ 493, గుంతకల్లు 528, తాడిపత్రి 536, శింగన మల 554, అనంతపురంఅర్బన్499, కళ్యాణదుర్గం 499, రాప్తాడు 484, మడకశిర 482, హిందూపురం 501, పెనుకొండ 541, పుట్టపర్తి 473, ధర్మవరం 569, కదిరి 576 మొత్తం 7,269 ఈవీఎంలు కేటాయించినట్లు తెలిపారు.
నామినేషన్ల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈ నెల 25న రెండో ర్యాండమైజేషన్లో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించాలని ఆర్ఓలకు సూచించారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, జెడ్పీసీఈఓ విజమేందిర, ఏజేసీ రామస్వామి, డీఆర్వో హేమసాగర్, అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ: సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూభవన్, జెడ్పీ హాల్, పెన్నార్భవన్లలో ఈవీఎంలపై మాస్టర్ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాప్తాడు, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్లకు రెవెన్యూభవన్లో, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల మాస్టర్ట్రైనర్లకు జిల్లాపరిషత్తు హాల్లో, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం,అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకు పెన్నార్ భవన్ మీటింగ్ హాల్లో ఆర్డీఓ స్థాయి అధికారులు మలోలా, చిన్నఓబుళేసు, శశిదేవి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
20న పీఓలకు, ఏపీఓలకు శిక్షణ:శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లతో ఈ నెల 20న 3,700 మంది పీఓలు, 3700 మంది ఏపీఓలకు మొదటి విడత ఈవీఎంలపై నియోజకవర్గ కేంద్రాల్లోనే శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.
ఈవీఎంల కేటాయింపు : కలెక్టర్
Published Mon, Apr 14 2014 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement