బీజేపీపై సోనియా ధ్వజం
ఆ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
యూపీఏ చేసినంత అభివృద్ధి మరే ప్రభుత్వం చేయలేదు
మేవాట్ (హర్యానా): ప్రధాని పీఠం దక్కించుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రతిపక్షంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ.. బీజేపీ, ఆపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శల దాడిని కొనసాగించారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు వేషాలు మారుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలు కేవలం దేశాభివృద్ధి కోసమే కాదని, కష్టనష్టాలకోర్చి స్వాతంత్య్ర సమరయోధులు, తాతముత్తాతలు మనకు ప్రసాదించిన రాజ్యాం గాన్ని పరిరక్షించడానికి కూడా అని సోనియా చెప్పారు.
లౌకికవాదులుగా ఎలా మెలగాలో రాజ్యాంగం మనకు నేర్పిందని, దానిని ఎలా పరిరక్షించుకోవాలో కూడా చెప్పిందని వివరించారు. భారతదేశం ఏ కొద్దమందిదో కాదని, ప్రజలందరి హక్కులు రక్షించడానికి కాంగ్రెస్ పోరాడుతుందని హామీనిచ్చారు. కుల, మత, ప్రాంత, భాష భేదాలు లేని లౌకిక దేశ నిర్మాణం గురించి తమ పార్టీ పాటుపడుతుందని చెప్పారు. మన్మో హన్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ.. పదేళ్ల కాలంలో యూపీఏ చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మరే ప్రభుత్వం చేయలేదన్నారు. ఆ అభివృద్ధికి మీరే సాక్షులంటూ సభికులనుద్దేశించి చెప్పారు. గతంలో తామిచ్చిన హామీలు.. గ్రామీణ ఉద్యోగ పథకం, విద్యాహక్కు చట్టం, సమాచారహక్కు చట్టం తదితరాలన్నింటిని నెరవేర్చామన్నారు. ప్రస్తుత మేనిఫెస్టోలో అందరికీ ఆరోగ్య పథకంతో పాటు మహిళలపై హింసను నిరోధించడానికి కఠినమైన చట్టాలను చేస్తామనే హామీ ఇచ్చామని కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పారు.
ప్రధాని పీఠం కోసమే మొసలి కన్నీళ్లు
Published Tue, Apr 1 2014 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement