సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఏడుగురు కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ తరఫున ఒకరు అసెంబ్లీకి తొలిసారి ఎన్నిక తమ నియోజకవర్గాల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
జిల్లా నుంచి ఏకైక మహిళ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పామర్రు నుంచి బరిలో దిగిన ఉప్పులేటి కల్పన గెలుపొందారు. ఆమె గతంలో రెండుసార్లు నిడుమోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. మూడోసారి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై విజయం సాధించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీచేసిన ఏకైక మహిళా అభ్యర్థి కల్పన కావడం విశేషం.
నాటి సర్పంచ్.. నేడు అసెంబ్లీకి...
వైఎస్సార్సీపీ తరఫున తిరువూరు అసెంబ్లీ బరిలో నిలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన వల్లూరుపాలెం సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు.
తొలిసారిగా తిరువూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బోడె ప్రసాద్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయన గతంలో పెనమలూరు సర్పంచ్గా పనిచేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు కూడా పోటీ చేయడం తొలిసారి.
ఎంపీ అభ్యర్థిగా విఫలమై.. ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి...
గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీమోహన్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 2009లో గన్నవరం నుంచే సీటు ఆశించిన ఆయన దాసరి బాలవర్ధనరావుకు అక్కడ సీటు కేటాయించడంతో విజయవాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ ఓటమి చవిచూశారు. టీడీపీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి పోటీచేసిన పోటీచేసిన ఆయన అప్పట్లో ఓటమిచెందారు.
లోక్సభకు కేశినేని...
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్ (నాని) కూడా ఎన్నికల బరిలో తొలిసారి దిగారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్పై గెలుపొంది లోక్సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు.
అసెంబ్లీకి ఏడు కొత్త ముఖాలు
Published Sat, May 17 2014 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement