ఆ కుటుంబంలో ‘ఏడు’పే..! | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబంలో ‘ఏడు’పే..!

Published Tue, May 13 2014 10:43 AM

ఆ కుటుంబంలో ‘ఏడు’పే..! - Sakshi

ఇబ్రహీంపట్నం, న్యూస్‌లై న్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీకి సంబంధించి పలు వార్డుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పోటీ చేయగా, అందరూ ఓటమి పాలయ్యారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు న్నారు. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్ యజమాని చెన్నయ్య కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు పలు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీచేశారు. 

ఒకటో వార్డు నుంచి చెన్నయ్య కుమారుడు భానుబాబు, 4,13 వార్డుల నుంచి కూతుళ్లు భానురేఖ, భానుప్రియ, 15వ వార్డు నుంచి భార్య అండాలు, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్‌బాబు, 9వ వార్డు నుంచి కోడలు జయ, 16వ వార్డు నుంచి కుమారుడు భానుచందర్ పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement
Advertisement