చంద్రబాబు పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పాతబస్తీని వైఎస్ ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించారు. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ప్రత్యేక చొరవ చూపారు. 2009లో వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే పాతబస్తీలో పలు దఫాలుగా పర్యటించి అభివృద్ధి కోసం రూ.రెండువేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఫలితంగా అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీరోడ్లు, రహదారులు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, మంచినీటి రిజర్వాయర్లు, పైప్లైన్లు, పాఠశాలల భవనాలు.. తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం కిర్లోస్కర్ నివేదిక మేరకు వైఎస్ రూ.800 కోట్లు కేటాయించారు. వెటర్నరీ ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పాటు స్కూలు భవనాల కోసం రూ.20 కోట్లు మంజూరు చేశారు. అలాగే అండర్గ్రౌండ్ కేబుల్ పనులను, 11 సబ్స్టేషన్లను మంజూరు చేశారు. చాంద్రాయణగుట్ట, లంగర్హౌజ్, ఉప్పుగూడ ఫ్లైఓవర్లను వైఎస్ హయాంలోనే మంజూరు చేశారు.
ఫ్లై ఓవర్కు పాతర
సికింద్రాబాద్- బేగంపేట ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీవీఘాట్ వరకు రూ.35కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఇందుకయ్యే వ్యయాన్ని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు సమానంగా భరించాలని అప్పట్లో నిర్దేశించారు. అయితే... వైఎస్ అకాల మృతితో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. శిలాఫలకం ఆనవాళ్లు కూడా లేకుండా తొలగించడం ప్రభుత్వ పెద్దల దుర్మార్గానికి నిదర్శనం.
కలగానే బస్ టెర్మినళ్లు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను నగరంలో రోడ్ల వెంట పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గమనించిన వైఎస్ మియాపూర్లో ఇంటర్ బస్ టెర్మినల్, ఔటర్పై మూడుచోట్ల ట్రక్పార్కులు ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినా తర్వాతి ప్రభుత్వాల తీరు వల్ల ఆ ప్రాజెక్టులు ఇంత వరకు పట్టాలపైకి ఎక్కలేకపోయాయి.
పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ
Published Fri, Apr 25 2014 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement