శాంతిభద్రతల విధుల్లోని భద్రతా సిబ్బంది ఓటుపైసుప్రీం
న్యూఢిల్లీ: శాంతి భద్రతల పర్యవేక్షణ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ఓటర్ల మాదిరిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాని ప్రాంతాల్లో వీరు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లోని సిబ్బంది మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించడమే కాక.. కుటుంబంతోపాటు అక్కడే నివసిస్తేనే సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్న కేంద్ర ఎన్నికల సంఘం వా దనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
2014 జనవరి 1 నుంచి ఈ రోజు వరకూ పోస్టింగ్ పొంది విధులు నిర్వర్తిస్తున్న వారంతా సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా భద్రతా సిబ్బంది వివరాలను రెండు రోజుల్లో ఈసీకి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో స్పందించిన ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కు కోసం ఇప్పటి వరకూ డిక్లరేషన్ సమర్పించని వారు తాము పని చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన 225 లోక్సభ స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల భద్రతా సిబ్బంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సాధారణ ఓటర్ల మాదిరే...
Published Tue, Mar 25 2014 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement