సాక్షి ప్రతినిధి,కాకినాడ : పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజోలు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి వదులుకుంటోంది. టీడీపీ పలు చోట్ల వలస నేతలకు పెద్ద పీట వేస్తున్నట్టుగానే రాజోలులో బీజేపీ వ్యవహరిస్తుండడంపై కమలదళం కస్సుమంటోంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా దక్కిన రాజోలు సీటును రాపాకకు అట్టిపెట్టారని, అది కూడా చంద్రబాబు ప్రమేయంతోనే జరుగుతోందని కమలదళం ఆగ్రహోదగ్రమవుతోంది.
రాజోలు నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన వేమాను పక్కనబెట్టి.. బీజేపీలో చేరీచేరగానే రాపాక అభ్యర్థిత్వానికి నాయకత్వం తలూపిందని సమాచారం ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. వాస్తవానికి రాపాక తొలుత టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు టీడీపీలోకి వెళ్లిన సందర్భంలోనే రాపాక కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారరని ప్రచారం జరిగింది.
అప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమై చాప కింద నీరులా సాగుతున్నాయి. టీడీపీలోకి వస్తే రాజోలు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు ఉండవని ముందుగా ఊహించబట్టే రాపాకను బాబు వ్యూహాత్మకంగానే బీజేపీలోకి పంపి, ఇప్పుడు టిక్కెట్టు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాబు ఎత్తుగడలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని వారికి వచ్చీరాగానే సీటు ఎలా ఇచ్చేస్తారని ఆక్రోశిస్తున్నారు. రాపాక ఆర్థికంగా స్థితిమంతుడైనంత మాత్రాన పార్టీ కోసం కష్టపడ్డ వారిని పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ తరఫున వేమా కాక.. రాపాక బరిలోకి ఎలా దిగుతారో చూస్తామని హుంకరిస్తున్నారు.
12న బత్తుల భవిష్యత్ నిర్ణయం
గత ఎన్నికల అనంతరం టీడీపీ జెండా భుజాన మోస్తున్న ఆ పార్టీ రాజోలు ఇన్చార్జి బత్తుల రాముకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ రాపాక సీటు కట్టబెట్టాలనే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై రాము ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నిర్ణయం తీవ్రంగా బాధించినా, తనను నమ్ముకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బరిలో దిగినందున ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగి, 12న పార్టీ కేడర్తో సమావేశమై భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
‘గోరంట్ల’ కోసం ‘చందన’కు పొగ
కాగా రాజమండ్రి సిటీ బీజేపీకి కేటాయిస్తున్నందున అవకాశం కోల్పోతున్న గోరంట్ల రాజమండ్రి రూరల్లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్కు పొగబెట్టే పనిలో హైదరాబాద్లోనే మకాం చేశారు. బుధవారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లా నుంచి ఉన్న ఏడుగురిలో ముగ్గురు సిట్టింగ్లకు మరోసారి అవకాశం కల్పించిన బాబు చందనకు మాత్రమే మొండిచేయి చూపించారు.
దీనిపై చందన సామాజికవర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ‘గోరంట్లకు స్థానం కల్పించేందుకు బలహీనవర్గాలకు చెందిన చందనకు అన్యాయం చేస్తారా?’ అని తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీలకు ఉన్న ఒక్కగానొక్క స్థానాన్ని కాకుండాచేసేందుకు టీడీపీలో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా బీసీల సత్తా ఏమిటో చంద్రబాబుకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కాషాయానికి పచ్చకామెర్లు
Published Thu, Apr 10 2014 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement