బరి తెగింపు..! | Sakshi
Sakshi News home page

బరి తెగింపు..!

Published Sun, May 4 2014 2:20 AM

TDP MLA, another leader held for violating Election Code

 విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తూ...అడ్డుగోలుగా తమ కా ర్యకలాపాలను సాగిస్తున్న వారు తాజాగా శని వారం కూడా ఇదే తరహాలో తమ నైజాన్ని బ యటపెట్టుకున్నారు. జనసేన పార్టీ  అధినేత ప వన్‌కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు పడరాని పాట్లు పడి చిరవకు పోలీసులకు అడ్డం గా దొరికిపోయారు.టీడీపీ విజయనగరం ఎమ్మె ల్యే అభ్యర్థి మీసాల గీత అనుచరులు పవన్ సభ కు రావాలంటూ స్థానిక యువతకు డబ్బు పం పిణీ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వా రు ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేం దుకు చేస్తున్న చేష్టలను చూసి పలువురు ము క్కన వేలేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు పంపిణీ చేసిన డబ్బుతో పలువురు మద్యం దు కాణాల్లో పండగ చేసుకున్నారు. పవన్ ప్రసం గం జరుగుతుండగా పక్కనే ఉన్న దుకాణాల్లో వారు పూటుగా మద్యం సేవించారు.
 
 అశోక్ గైర్హాజరుపై గుసగుసలు
 తమ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేం దుకు వచ్చిన పవన్‌కళ్యాణ్ సభకు టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌గజపతిరాజు గైర్హాజరు కావడంపై పలువురు గుసగుసలాడుకున్నారు. ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్‌తో ప్రచార సభలు నిర్వహిస్తుండగా.. అ టువంటి సభలో అశోక్ లేకపోవడం పలు అనుమానాలు తావిచ్చింది. పవన్ ఎప్పుడు ఏం మా ట్లాడుతాడోనన్న భయంతోనే...లేదంటే ఇటువంటి చిన్న కార్యక్రమానికి హాజరైతే ఒనగూరేదేమింటుందోనని అనుకున్నారో ఏమో కాని అశోక్ మాత్రం పవన్ సభకు రాలేదు.  
 

Advertisement
Advertisement