సాక్షి, ముంబై: లోక్సభ మొదటి విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్న బుల్డానా, అకోలా, అమరావతి, వార్దా, రామ్టెక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరొలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలించారు. సరైన వివరాలు లేని కారణంగా 48 నామినేషన్లు తిరస్కరించామని ప్రకటించారు.
నాగపూర్లో దాఖలైన 51 నామినేషన్లలో ఆరు, రాంటెక్ స్థానంలో దాఖలైన 30 నామినేషన్లలో మూడు తిరస్కరించినట్టు తెలిపారు. అకోలాలో తొమ్మిది మంది అభ్యర్థులు 22 నామినేషన్లు దాఖలు చేశారని, వీటిలో బి ఫార్మ్ లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. బుల్డానా లోక్సభ నియోజకవర్గంలో కూడా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 48 నామినేషన్లలో ఐదు, వార్ధాలో ఏకంగా 13 మంది నామినేషన్లను తిరస్కరించారు. అమరావతిలో మూడు, భండారా-గోండియాలో నాలుగు, చంద్రాపూర్లో ఆరు, గడ్చిరోలి-చిమూర్లో రెండు, యావత్మాల్-వాషీంలో నలుగురి నామినేషన్లు తప్పుగా ఉన్నాయని ఈసీ అధికారులు తెలిపారు.
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
నామినేషన్లను ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే అనేకమంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మంగళవారం కూడా మరికొంతమంది ఉపసంహరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉండనున్నారనేది ఖచ్చితంగా తెలియనుంది.
విదర్భ ప్రాంతంలో 48 నామినేషన్లు తిరస్కరణ
Published Tue, Mar 25 2014 10:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ..
సమ్మర్ హీట్కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
Advertisement