తాండూర్, న్యూస్లైన్: ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయరు. అదేమిటి అనుకుంటున్నారా? అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు ఎదురైన పరిస్థితి. ఓటర్లు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టిన అధికారుల తీరు వివరాలివీ... తాండూర్ మండలంలోని కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలో 2,422, కొత్తపల్లి-2 ఎంపీటీసీ పరిధిలో 2,426 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు మాదారం-3 ఇంక్లైన్ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలోకి వచ్చే అబ్బాపూర్, బెజ్జాల, ఆసాలమాడ గ్రామాలకు చెందిన గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోవల్సి ఉంది. మాదారం-3 ఇంక్లైన్ గ్రామానికి చెందిన ఓటర్లు మాత్రం మాదారం టౌన్షిప్కు వచ్చి కొత్తపల్లి-2 ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన వింత పరిస్థితి ఉంది. గిరిజన గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న నర్సాపూర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సుమారు 650 మంది ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేవారు. ప్రస్తుతం నిర్దేశించిన ఎంపీటీసీ పరిధిలో లేని గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో గిరిజనులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎనిమిది కిలోమీటర్ల దూరం వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవల్సి ఉంది.
మాదారం-3 ఇంక్లైన్ గ్రామానికి చెందిన 450 మంది మాదారం టౌన్షిప్కు వచ్చి ఓటు వేయాలి. మాదారం, మాదారం-3 ఇంక్లైన్ గ్రామాల్లో కొత్తపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోకి రాగా మిగతా గ్రామాలు కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలోకి వెళ్తాయి. కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలో లేని పోలింగ్స్టేషన్1(మాదారం-3 ఇంక్లైన్)లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారి సౌలభ్యం కోసమే ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఓటర్లు ఒకచోట.. పోలింగ్ కేంద్రం మరోచోట
Published Wed, Apr 2 2014 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement