సార్వత్రిక ఎన్నికల్లో ముందుగా చెప్పుకోవాల్సిన ఏకైక పార్టీ.. కాంగ్రెస్. ఈసారి ఎన్నికలకు ఏమాత్రం సంసిద్ధం కాకుండా దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందునుంచే ఒకరకంగా తన ఓటమిని కాంగ్రెస్ స్వయంగా అంగీకరించింది. ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతూ వచ్చాయి. వరుసపెట్టి స్కాముల్లో కూరుకుపోవడం, రాష్ట్రాల ఎన్నికల్లో పదే పదే ఓటమి, విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, వృద్ధిరేటు మందగమనం, మరోవైపు ప్రచారపర్వంలో బీజేపీ దూసుకెళ్లడం.. ఇలా అన్నీ కాంగ్రెస్కు ప్రతికూలంగానే మారిపోయాయి. 'రాబోయేది మోడీ ప్రభుత్వం', 'కాంగ్రెస్ నుంచి భారతదేశానికి విముక్తి' లాంటి బీజేపీ నినాదాలకు కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం అన్నదే లేకుండా పోయింది.
యూపీఏ ప్రభుత్వంలో తిరుగులేని ఆధిక్యం కనబరిచిన పలువురు మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ లాంటివాళ్లు ఈసారి అసలు ఎన్నికల బరిలోకి దిగకపోవడం కూడా నైతికంగా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దిగ్విజయ్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి సీనియర్ నాయకులు ఎన్నికల సమయంలోనే అనవసర వివాదాల్లో కూరుకుపోవడం ఆ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపింది. పార్టీ ప్రచారాన్ని సోనియాగాంధీ ఏ దశలోనూ ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
పార్టీ పగ్గాలను గానీ, ప్రభుత్వ పగ్గాలను గానీ అందిపుచ్చుకోడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని యువరాజు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో జనానికి విసుగెత్తించారు. ఏ దశలో కూడా.. ఆయన ప్రసంగాలు ప్రజలకు కాకపోయినా.. సొంత పార్టీ వర్గాలకు కూడా స్ఫూర్తిని ఇవ్వలేకపోయాయి. మరోవైపు ఆయన ప్రత్యర్థి నరేంద్ర మోడీ రోజుకు ఐదు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ కూడా పూర్తిస్థాయి ఎనర్జీని ప్రదర్శించారు. దాంతోపాటు చాయ్ పే చర్చా పేరుతో సామాన్యులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వేగాన్ని రాహుల్ అందుకోలేకపోయారు. ప్రధాని అభ్యర్థిగా కూడా తనను ప్రకటించవద్దని కోరడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం. తల్లీకొడుకులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మోడీ తన ప్రసంగాల్లో చేసిన పదునైన విమర్శలకు అవతలి నుంచి సమాధానం రాలేదు.
ఇక కూటమిని కూడగట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. డీఎంకే, టీఎంసీ లాంటి పెద్ద పార్టీలు దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ అయ్యింది. ఇక తోడుగా ఉంటూనే ఎన్సీపీ మాత్రం శల్యసారథ్యం వహించింది. బీజేపీ మాత్రం చాపకింద నీరులా ఎక్కడికక్కడ మిత్రులను కలుపుకొని పోతూ ఘనవిజయాలు సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ కొంప ముంచిన అంశాలేంటి?
Published Fri, May 16 2014 12:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement