ఓటేయకుంటే ఓటుపై వేటేయండి | Sakshi
Sakshi News home page

ఓటేయకుంటే ఓటుపై వేటేయండి

Published Sun, Apr 20 2014 3:05 AM

ఓటేయకుంటే ఓటుపై వేటేయండి - Sakshi

 ఎన్నికల్లో ఓటర్లు క్రియాశీలకంగా పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఎన్నికల సంఘానికి తీవ్రమైన సూచన చేశారు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారు తదుపరి ఎన్నికల్లో ఓటేయకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీ లించాలని కోరారు. ఈమేరకు తాను ఈసీకి లేఖ రాశానని ఆయన శనివారం మధ్యప్రదేశ్‌లోని థాండ్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు.

‘ఓటు వేయనివారిపై కొన్ని దేశాలు జరిమానా విధిస్తున్నాయి. మనదేశంలోనూ జరిమానా వేయాలని నేను కోరడం లేదు. అయితే ఎన్నికల్లో ఎవరైనా ఓటేయకుంటే తదుపరి ఎన్నికల్లో అతన్ని ఓటు వేయడానికి అనుమతించొద్దు’ అని అన్నారు.
 

Advertisement
Advertisement