తిరువూరు: సంక్షేమ పథకాలతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డు సృష్టించారని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒక్క రూపాయి కూడా ప్రజలపై పన్ను భారం పడనివ్వలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కృష్ణా జిల్లా తిరువూరులో జరిగిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు.
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేశారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేసిందని గుర్తు చేశారు. జగనన్నను సీఎం చేద్దాం, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. జగనన్న సీఎం అయితే మహానేత వైఎస్సాఆర్ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పారు. ఒక్క అవకాశమిస్తే తన జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా జగనన్న ఉన్నారని తెలిపారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని షర్మిల అన్నారు. కాగా, షర్మిల రోడ్ షోకు తరలివచ్చిన జనంతో తిరువూరు జనసంద్రంగా మారింది.
Breadcrumb
'జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు'
Published Wed, Mar 26 2014 7:12 PM
Related news
-
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్కు చెందిన శ్రీనివాస గార్డెన్స్లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్లోని గెస్ట్హౌస్పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ను, వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
మంచి చేసిన జగన్ నే గెలిపించండి ఇంటింటి ప్రచారం
మంచి చేసిన జగన్ నే గెలిపించండి ఇంటింటి ప్రచారం -
నన్ను, సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు.
Related News by category
-
సొమ్మంతా ప్రసాదార్పణం
కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024అక్కడ వ్యాపారుల కూటమి షో అట్టర్ ఫ్లాప్ వెండితొడుగు బహూకరణ పామర్రు మండలం రాపర్లలో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు వెండి సర్వాంగాన్ని బహూకరించారు. బెజవాడలో భారీ అగ్ని ప్రమాదంవిజయవాడలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. మందుల, వస్త్రాల గోడౌన్లో ప్రమాదం సంభవించింది. u8లో సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే...రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు జిల్లాలో హాట్ సీట్..ఇన్కం క్రియేట్ సీట్గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్తోనే సీటు దక్కింది ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఇచ్చేది, పార్టీ అధిష్టానం దయతలచి ఇచ్చేది కాగా వచ్చిన సొమ్ములో కొంత ఖర్చులు పోనూ మిగిలిన దాంతో ఇల్లు చక్కపెట్టుకునే పనిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ద్వాదళ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 9–30 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ చేస్తారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఉత్సవాలకు అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్నిప్రతిష్టాపన, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. 19 నుంచి 23 వరకుగత ఎన్నికల్లో సైతం... జగన్కు అడుగడుగునా జన ప్రవాహం 7న్యూస్రీల్ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. ఆ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వసూళ్ల పర్వం వసూళ్ల కోసం ప్రత్యేకంగా కమిటీ నియామకం బిల్డర్లు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలే లక్ష్యం కోట్లు వసూలు చేసి ఇల్లు చక్కబెట్టుకునే యత్నం ఇప్పటికే బోలెడు డెనేషన్ల వసూలు కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే...పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. -
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
● అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నామినేషన్లు ● పార్లమెంట్ స్థానానికి దాఖలు కాని నామినేషన్లు చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టమైన అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్కు టీడీపీ అభ్యర్థిగా వర్ల కుమార్రాజా గురువారం రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వక్కలగడ్డ పావని రిటర్నింగ్ అధికారి ఎం.వాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రెండు సెట్ల నామినేషన్లు, ఆయన భార్య యార్లగడ్డ జ్ఞానేశ్వరి ఒక సెట్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసెంబ్లీకి 11,పార్లమెంట్కు రెండు నామినేషన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం –1 పబ్లిక్ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. -
జగన్ ఆశయాలు ఉన్నతం
కోనేరుసెంటర్: పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం, విద్య ఉచితంగా అందజేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆశయం ఎంతో గొప్పదని వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. బందరు మండలం వాడపాలెంలో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ సీఎం ఆశయాలు ఉన్నతమైనవన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో వేలాదిమంది ఆరోగ్యానికి భరోసా కల్పించారన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన వైద్య సాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజలకు అందజేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించేలా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామాలకే అన్ని విభాగాల వైద్య నిపుణులను రప్పించి మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో కూడిన ఉచిత విద్య అందుతుందన్నారు. మనందరి కోసం ఎన్నోసార్లు బటన్ నొక్కిన జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మీరంతా ఒక్కసారి ఆయన పార్టీ గుర్తుపై బటన్ నొక్కి అఖండ మెజార్టీని అందజేయాలని కోరారు. ఎన్నికల బరిలోకి దిగుతున్న తమను సహృదయంతో ఆశీర్వదించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖరరావు -
No Headline
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి. సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పెడన, మచిలీపట్నంలో... ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం. మచిలీపట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి. జనం లేక ఆలస్యంగా సభలు జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో రమేష్బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతితో పరిసమాప్తం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఆది దంపతులకు మంగళ స్నానాలు ధ్వజారోహణతో దేవతలకు ఆహ్వానం
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement