'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు' | Sakshi
Sakshi News home page

'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'

Published Tue, Apr 15 2014 12:42 PM

'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు' - Sakshi

గుత్తి: వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్ విమర్శించారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసి.. కిలో రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. నీ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు మరిచిపోయావా చంద్రబాబూ అని ప్రశ్నించారు.

ఆయన అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. వైఎస్ఆర్‌కు ముందు ఎందరో సీఎంలు వచ్చారు కాని ప్రజలకు గుర్తుండే సీఎం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తామని జగన్ హామీయిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement
Advertisement