సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ సీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేదల తరపున పోరాటాలు నిర్వహించిన పార్టీ ప్ర జలకు మరింత చేరువ కానుంది. ఇందులో భాగంగా, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు వీలుగా సమన్వయకర్తలను నియమించింది.
కొత్తగా వీరే
రెండు రోజుల క్రితం జహీరాబాద్ లోక్సభ, బోధన్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో ముగ్గురు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సింగిరెడ్డి రవీందర్రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి అంతిరెడ్డి శ్రీధర్రెడ్డి, రూరల్ నియోజకవర్గానికి బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) సమసన్వయకర్తలుగా వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు.
చురుకైన నాయకులు
బోధన్కు చెందిన రవీందర్రెడ్డి క్రియాశీలక రాజకీయాలలో ఉంటూ వైఎస్ఆర్ సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. యువనాయకుడు అంతిరెడ్డి శ్రీధర్రెడ్డి విద్యా ర్థి, యువజన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. డిచ్పల్లి ఎమ్మెల్యేగా పని చేసిన అంతిరెడ్డి బాల్రెడ్డి కుమారుడైన శ్రీధర్రెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు.
వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ మండలం సిర్పూరుకు చెందిన బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) జలగం వెంగళరావు కాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సర్పంచ్గా, ఎంపీటీసీ, పనిచేసిన ఆయన సతీమణి బొడ్డు సుచరిత ఎంపీపీగా పనిచేశారు. సిర్పూరుకు రోడ్డు వేయడం కోసం ఉద్యమాలు నిర్వహించి సిర్పూరు గంగారెడ్డి పేరు తెచ్చుకున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానానికి మహమూద్ మొహి యొ ద్దీన్, బోధన్కు ఎంఏ ఖాన్, కామారెడ్డికి చిల్కూరు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డికి పటోళ్ల సిద్దార్థరెడ్డి, జుక్కల్కు నాయుడు ప్రకాశ్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నా యుడు ప్రకాశ్ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన పార్టీ కసరత్తు చేస్తుండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.
‘సార్వత్రికా’నికి వైఎస్ఆర్సీపీ సిద్ధం
Published Mon, Mar 31 2014 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement