రోజుకు దాదాపు 50 మైళ్లు... అలా 32 రోజులు. మొత్తంగా 1,460 మైళ్ల దూరం! అది కూడా సఫారీల మధ్యన.. అటవీ జంతువులకు ఆవాసమైన దక్షిణాఫ్రికాలోని కొండలు, గుట్టలతో ఉన్న అడవుల మధ్య. పైగా ఈ సాహసం చేసిందేమీ పడచు పిల్ల కాదు, 52 యేళ్ల నడివయస్కురాలు!
అంతటి సాహసం చేసింది... మిమి అండర్సన్. ఈ పరుగును ఆమె తన ప్రతిభను చాటుకోవడానికి కాదు... ఒక సంక్షేమ కార్యానికి నిధులు సమకూర్చడం కోసం పూర్తి చేసింది. తమ దేశమైన దక్షిణాఫ్రికాలో వివక్షకు గురి అవుతున్న మహిళల, బాలికల సంరక్షణార్థం నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన మిమి విజయవంతంగా 22 వేల పౌండ్ల నిధిని సేకరించగలిగింది. మిమీది అనేక రేసుల్లో పాల్గొని, ఛాంపియన్గా నిలిచిన నేపథ్యం. దాంతో ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను మహిళా సంక్షేమం కోసం వెచ్చించాలనుకుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా భారీ మారథాన్కు శ్రీకారం చుట్టింది.
మారథాన్ను మొదలు పెట్టడానికి ముందు ఒక వెబ్సైట్ను ప్రారంభించింది మిమీ. అందులో తన ప్రయాణం గురించి వివరిస్తూ విరాళాలను కోరింది. పీటర్మారిట్జ్బర్గ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేప్టౌన్ సమీపంలోని పార్ల్లో తన మారథాన్కు ముగింపును ఇచ్చింది మిమి. ఈ ప్రయాణంలో మిమి పడ్డ కష్టాలు అలాంటిలాంటివి కాదు... చెట్లు, చేమలు, కొండలతో నిండి ఉన్న ఈ అటవీప్రాంతంలో పరిగెత్తడం మామూలు మాటలు కాదు.. అందులోనూ ఒకటి కాదు రెండు కాదు... రోజుకు సుమారు 50 మైళ్ల దూరం పరుగెత్తింది మిమి. సముద్రమట్టానికి కొన్ని వందల, వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో పరుగు పెట్టడం అంత సులభం కాదని.. అయితే ఒక మంచి పని కోసం కష్టపడుతున్నాననే భావన కొండంత స్థైర్యాన్ని ఇచ్చిందని సంతోషంగా చెప్పింది. దటీజ్ మిమి.
30 రోజుల్లో 1400 మైళ్లు పరుగెత్తింది!
Published Tue, Dec 16 2014 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement