ముఖం కాంతిమంతంగా ఉండాలంటే... | Sakshi
Sakshi News home page

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే...

Published Thu, Dec 22 2016 11:13 PM

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే...

బ్యూటిప్స్‌

రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది.

టీ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో అయిదారు చుక్కల తేనె, టీ స్పూన్‌ కమలాపండు రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుగా మెరుస్తూ ఉంటుంది.

స్నానానికి 20 నిమిషాల ముందు చర్మానికి నిమ్మరసం పట్టించి, ఆ తర్వాత వేపాకులు వేసి మరిగిం చిన నీటితో స్నానం చేస్తే చర్మం చాలా మృదువుగా, కాంతివంతం గా తయారవుతుంది.

తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్‌ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది.
 

Advertisement
Advertisement