బ్యూటిప్స్‌ | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Published Thu, Mar 9 2017 11:11 PM

బ్యూటిప్స్‌

టేబుల్‌ స్పూన్‌ పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్‌ వాటర్, తేనె, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిస్తే ముఖం నిగారిస్తుంది.టీ స్పూన్‌ శనగపిండిలో మూడు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బొప్పాయి రసం కలిపి పేస్ట్‌ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. అర టేబుల్‌ స్పూన్‌ మెంతులను పొడి చేయాలి. దీంట్లో పెరుగు, మూడుచుక్కల రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది.

Advertisement
Advertisement