ఆధునిక రవాణా వ్యవస్థ వాయువేగంతో దూసుకుపోతుంటే.. ఆదివాసీలు మాత్రం తమ సంప్రదాయ రవాణా వ్యవస్థను వీడటం లేదు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ ఫాస్టు రైళ్లు, వోల్వో బస్సులు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చినా.. అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఈ గిరిజనుల మాత్రం ఆ సదుపాయాల దరికి చేరడం లేదు! ఇప్పటికీ వారు సుదూర ప్రయాణాలకు ఎడ్లబండ్లనే ఎంచుకుంటున్నారంటే నమ్మి తీరాల్సిందే. అలా వందల కిలో మీటర్లు దూరంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ల నుంచి కుటుంబాలతో కలిసి బండ్లపై వచ్చిన ఆదివాసీలతో గత నాలుగు రోజులగా నాగోబా సన్నిధిలో ‘జాతర’ జరిగింది. అలా వచ్చిన వారిలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పాండ్రవణికి చెందిన మేస్రం జాగేరావు, దుర్పతబాయిలు కూడా ఉన్నారు. వారు తమ కొడుకు, కోడలు మనువళ్లు, మనువరాండ్లతో సకుటుంబ సమేతంగా జాతరకు వచ్చారు.
ఆ కుటుంబం ఈనెల 14న తమ స్వగ్రామం నుంచి ఎడ్లబండ్లపై బయలుదేరింది. ఐదు రోజుల పాటు అటవీ మార్గం గుండా వీరి ప్రయాణం సాగింది. ఈనెల 18న రాత్రి నాగోబా కొలువై ఉన్న కేస్లాపూర్కు చేరుకుంది. సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం ఎడ్లబండ్లపైనే సాగింది. వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలు సంస్కృతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారనడానికి ఇదే నిదర్శనం. ‘‘నాగోబా జాతరతున్ కోంద, కసూర్తో వయివాల్ మా ఆచార.. ఇద్ సల్దున్ గేర్ మావ ఆచారం పకరం వాతోమ్.. కోంద, కసూర్తే వాతేకే మాకున్ చోకోట్ కరేమాంత్’’ (నాగోబా జాతరకు ఎడ్లబండ్లపై రావడం మా ఆచారం.. ఈసారీ మా ఆచారాన్ని కొనసాగించాము. ఈ ఎడ్ల బండ్లపై జాతరకు రావడం సంతోషంగా ఉంటుంది) అంటున్నారు మేస్రం జాగేరావు తమ గోండి బాషాలో. ఈనెల 22న జాతర ముగిసిన అనంతరం వీరంతా ఇక్కడి నుంచి తిరిగి తమ గూడేనికి బయలుదేరి వెళతారు.
- పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
ఎడ్ల చలోరే...
Published Wed, Jan 21 2015 11:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement