నేను, మా వారు ఇద్దరం ఉద్యోగస్థులమే. మాకు 2, 3 తరగతులు చదివే పిల్లలున్నారు. మేము నెలవారీగా కానీ, మూడునెలలకోసారి గానీ స్టాక్మార్కెట్లో కొంత మొత్తం పెట్టుబడి పెడదామనుకుంటున్నాము. అయితే మాకు షేర్లను కొంటారు, అమ్ముతారు అని తెలుసు కానీ, స్టాక్మార్కెట్ గురించి బొత్తిగా తెలియదు. ట్రేడింగ్ ఎలా చేయాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తగిన సలహా ఇవ్వగలరు.
- సురేఖ, హైదరాబాద్
సురేఖా! షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు జాతీయ స్థాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, కంపెనీలున్నాయి. అవి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈ). వీటి ద్వారా షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. ఈ ఎక్స్ఛేంజీలలో లావాదేవీలు నిర్వహించాలనుకునే వారికి, స్టాక్ ఎక్స్ఛేంజీలకు మధ్యవర్తిత్వం నెరిపేందుకు గుర్తింపు పొందిన (రిజిస్టర్డ్) స్టాక్బ్రోకర్లుంటారు.+
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ముందు మీరు గుర్తింపు పొందిన స్టాక్ బ్రోకర్ వద్ద బ్రోకింగ్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ఏదైనా రిజిస్టర్డ్ డీపీ (డిపోజిటరీ పార్టిసిపెంట్) వద్ద డీ మ్యాట్ ఎకౌంట్ కలిగి ఉండాలి. మీరు డబ్బు దాచుకునే బ్యాంక్ తాలూకు ఆన్లైన్ ఎకౌంట్ కూడా ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్ను సింగిల్ షేర్తో కూడా ఆరంభించవచ్చు. నెలవారీగా నిర్దిష్టమొత్తంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)తో మంచి గ్రోత్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయవచ్చు. కొద్దిమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్. ఇదే సందర్భంలో మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్లో మదుపు చేసేముందు ఈ కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. షేర్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారంలో నగదు లావాదేవీలు నిర్వహించవచ్దు. ఆమోదించవద్దు. సంబంధిత రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ పేరిట చెక్కును మాత్రమే జారీ చేయండి లేదా మీ పేరుతో ఇచ్చే చెక్కులను మాత్రమే ఆమోదించండి.
డీమ్యాట్ అకౌంట్లో నామినీ పేరును తప్పనిసరిగా నమోదు చేయించండి.
లో బీటా స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
బ్లాంక్ డీ మ్యాట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ బ్లాంక్ చెక్కులు కానీ జారీ చేయకూడదు.
మీ ఇంటర్నెట్ ట్రేడింగ్ పాస్వర్డ్ను ఎవరికీ చెప్పవద్దు.
{sేడింగ్ కోసమని అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టవద్దు.
సింగిల్ స్టాక్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయవద్దు.
- రజని భీమవరపు, సీఎఫ్పీ, జెన్మనీ
స్టాక్మార్కెట్లో మదుపు చేయాలనుంటే..?
Published Tue, Feb 10 2015 10:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement