సంస్కృతి
∙ ప్రతి తండాలో దాటుడు పండుగ – విత్తనాలు వేయగానే పండుగకు శ్రీకారం
∙ సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు
∙ గిరిజన సాంప్రదాయాల మధ్య అడవి తల్లికి పూజలు
తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి లంబాడాల ఆచార వ్యవహారాలు ప్రత్యేకం. అడవిలో ప్రతి చెట్టు, పుట్ట, రాయి. గుట్ట అన్నీ వారికి ఆరాధ్య దైవాలే.. అంతా అ దేవుడిపైనే భారం. బిడ్డ పుట్టిన నాటి నుండి పెరగడం, పెళ్లి ఇలా అన్ని శుభకార్యాలూ ఆ అమ్మవారి చలువతోనే జరుగుతాయని నమ్మకం. చివరకు చనిపోయినా.. ప్రత్యేక పూజలు చేస్తారు.
తొలకరి జల్లులు పడగానే పుడమి తల్లి ఒడిలో విత్తనాలు వేసి, అవి సక్రమంగా మొలకెత్తాలని, పశువులు పరిపుష్ఠిగా ఉండి వ్యవసాయానికి ఉపయోగపడాలని. పంటలు సమృద్ధిగా పండాలని శీత్లా భవాని అమ్మవారిని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాడం, శ్రావణ మాసాల్లోని మంగళవారంలో జరుపుకునే శీత్లా భవాని(దాటుడు పండుగ)పండుగ గిరిజన తండా పండుగల్లో కీలకమైనది. పశువులకు, మనుషులకు, పంట చేలకు వ్యాధులు రాకూడదని, ఏ దుష్టశక్తి కూడా తమ వైపు చూడకూడదని శీత్లా భవాని అమ్మవారిని కోరుతూ పండుగ జరుపుకుంటారు.
పునాస పంటలతో పచ్చటి రంగేసుకున్న పుడమి తల్లి ఒడిలో రంగురంగుల దుస్తులు, కళ్లు మిరిమిట్లు గొలిపే అద్దాల ముసుగులు, ముంజేతి గాజులు, ఘల్లుఘల్లుమనే కాళ్ల కడియాలతో అందంగా అలంకరించుకొని యువతీయువకులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శీత్లా భవాని పండుగ.
వేడుక ఇలా..
శీత్లా భావాని అమ్మవారికి మంగళవారం ఉత్సవాలు జరుపుతారు. దీనిని గొడ్లదాటుడు పండగ అని కూడ పిలుస్తారు. తండా పెద్ద నిర్ణయం ప్రకారం పండుగకు ఒక రోజు ముందుగా రాత్రి వాసిడో.. వాసిడో..(పాత గుగ్గిళ్లు) అని కేకవేస్తూ ఒక వ్యక్తి తండాలోని వీధి వీధి తిరుగుతాడు. అంటే రేపు పండుగ చేయాలని అర్థం. తండా శివారులో రావి, వేప, మోదుగు చెట్టుకింద ఏడు రాతి బండలను నిలువున పాతి పెట్టి (అమ్మవారి ఏడు ప్రతి రూపాలు ఏడు బండలు) ఎర్రటి మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. తమ వ్యవసాయ భూముల్లో పండిన ధాన్యాలు మక్కలు, బొబ్బర్లు, సెనగలు కలిపి గుడాలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొని గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిపై నైవేద్యం పెట్టుకొని నృత్యాలు చేసుకుంటూ శీత్లా భవాని పండుగ జరిపే ప్రాంతాలకు వస్తారు.
నంతరం అక్కడ ఉన్న కుల పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. శీత్లా భవానికి వేట బలి ఇస్తారు. రక్తంలో ధాన్యాలను కలిపి పశువుల పై చల్లుతారు. అనంతరం గిరిజన మహిళలు శీత్లా భవానికి తెచ్చిన నైవేద్యాలను ఒక దగ్గర పెట్టి లంబాడీ భాషలో గేయాలు అలపిస్తూ ఆనందంగా నృత్యాలు చేస్తారు.
– భిక్షం, సాక్షి, సిద్ధిపేట
మముగను తల్లీ శీత్లా !
Published Sat, Jul 29 2017 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
స్థిరంగా బంగారం, వెండి: ఈ రోజు కొత్త ధరలు ఇలా..
పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
బిగ్బాస్ విన్నర్ తేజస్వి బోల్డ్ లుక్స్ (ఫోటోలు)
ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement