ఒకసారి యేసువద్దకు ఒక స్త్రీని కొందరు తీసుకొచ్చి ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా.. మరి నీవేమంటావు’ అని అడిగారు. ప్రభువు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసు ‘‘అవును... ఆమెను రాళ్లతో కొట్టి చంపవలసిందే... కానీ ఎవరిలోనైతే పాపం లేదో ఆ వ్యక్తి మాత్రమే ఆ శిక్షను అమలు చేయాలి’’ అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా రాళ్లు అక్కడ పడవేసి ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు. ఇక్కడ మనమంతా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా తప్పో, పాపమో చేస్తే మనమంతా ఆ పని చేసిన వారిని శిక్షించాలని. దూరం నుంచైనా ఒక రాయి వారిమీద వేయాలని ప్రయత్నిస్తాం. ఒకవేళ ఆ శిక్షను అమలు చేసే అవకాశం వస్తే మనమే అమలు చేస్తాం. అది అమలు చేసేటప్పుడు మనం తప్పు చేసే వాళ్లం కాదని, అసలు పాపమే చేయలేదనే భావనతో ఆ పని చేస్తాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనమందరమూ కూడా తప్పో, పాపమో చేస్తూనే ఉంటాం. అది బయటకు కనిపించక పోవచ్చు. హృదయంలో మనం కూడా అదే తప్పు ఆలోచనలు కలిగి ఉండి ఆ పనిని బయటకు చేసిన వానిని మాత్రం శిక్షించడానికి ముందుంటాం.
ఒక్కసారి ఆలోచించాలి. యేసు తలయెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ మీద నేరారోపణ చేసిన వారెవరూ కనిపించలేదు. అపుడు యేసు ఆ స్త్రీని చూసి ‘‘అమ్మా..!. నీవు కూడా వెళ్లు, అయితే మళ్లీ పాపం చేయకు’’ అని చెప్పాడు. అంటే శిక్షతో కాకుండా క్షమించడం ద్వారా ఆ స్త్రీని మార్చాలనుకున్నాడు. భావోద్వేగాలను తమ నియంత్రణలో ఉంచుకున్నవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఆ స్త్రీని వాళ్లు తీసుకొస్తున్నప్పుడు గానీ ఆమెను శిక్షించాలనే తలంపుతో రాళ్లు చేత పడుతున్నపుడు గానీ వారిలో ఏ విధమైన ఆలోచనా లేదు, ఈమె పాపం చేసింది, మేము చేయలేదు కనుక ఈమెను శిక్షించాలి ఆనే ఆలోచన తప్ప! కానీ యేసు మాట్లాడిన ఆ ఒక్క మాట వారిని ఆలోచింప జేసింది. ఒక్కసారి మనం ఎదుటి వ్యక్తిని క్షమించడం అలవాటు చేసుకుంటే అది ఎంత సంతోషాన్నిస్తుందో అర్ధమౌతుంది. అయినా శిక్షించడానికి ఆయుధం ఉంటే చాలు. అదే క్షమించాలంటే హృదయంలో చాలా ధైర్యం కావాలి, అనేక సందర్భాలలో శిక్షలకన్నా కూడా ప్రేమ, క్షమాపణ తప్పు చేసిన వ్యక్తులలో మార్పులు తీసుకొస్తాయి. తప్పు చేసిన వ్యక్తి మారాలని కోరుకోవాలి కానీ మరణించాలని కోరుకోకూడదు.
– రవికాంత్ బెల్లంకొండ
దూరం నుంచి ఒక రాయి
Published Sun, Jul 29 2018 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement