‘ప్రాతినిధ్య-2015’ ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న గౌతమ్ ఘోష్. చిత్రంలో అస్లాం హసన్, బి.నర్సింగరావు ఉన్నారు. సామాన్య(ఈ సంకలన సంపాదకుల్లో ఒకరు) మా ఇంటికి వచ్చి, తన ‘టీ తోటల ఆదివాసుల కథలు’ పుస్తకం ఇచ్చి, ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణకి రమ్మని కోరింది. నాకు తెలుగు సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన లేకపోయినప్పటికీ, కొంత తెలుసు. ‘మా భూమి’ నా మొదటి సినిమా. తెలంగాణ అంటే ఎనలేని అభిమానం. ఆ రోజుల్లో నేను శ్రీశ్రీ, గోపీచంద్ మొదలైన రచయితల రచనలు చదివాను. అయితే, ఎక్కువగా అనువాదాలు చదివాను. తెలుగు సాహిత్యం సంపన్నమైనది. చలనశీలమైన ఈ సమాజంలో జరుగుతున్న మార్పులను రచయితలు రికార్డు చేస్తున్నారు.
మనదేశంలో ఏకకాలంలో అనేక శతాబ్దాలు సహజీవనం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని విచక్షణ కలిగిన యూరోపియన్లు కూడా పేర్కొన్నారు. మీరు యాత్రాస్థలాలకి వెళితే, అనేక పురాతన విశ్వాసాలతో మనుష్యులు కనిపిస్తారు. అవే విశ్వాసాలు ఈ దేశ అత్యాధునికులకి అప్రాసాంగికం కావొచ్చు. ఈ భారతీయ సమాజంలో అనేక పొరలు ఉన్నాయి. అందువలన ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం వంటిది.
ఈ ప్రాతినిధ్య సంకలనంలో మహిళల, దళితుల, ముస్లింల కథలు ఎక్కువగా ఉండటం సంతోషకరమైన విషయం. ఈ దేశ సబ్బండవర్ణాల అస్తిత్వం ఘనమైనది. అది ఇంకా ఎక్కువగా సాహిత్యంలో ప్రతిఫలించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత అభివృద్ధి నమూనాలో ఎక్కువగా బాధితులు కూడా ఈ వర్గాలే. అది కూడా సాహిత్యంలో ఇంకా ఎక్కువగా రావాలి.
రచయితలు మన సమాజాన్నీ, చరిత్రనీ, సంస్కృతినీ, అంతః బాహ్య చేతనలనీ రికార్డు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరుగుతున్నది. మత అసహనం, సాంస్కృతిక అసహనం, రాజకీయ అసహనం పెరుగుతున్న ఈ తరుణంలో రచయితలు ముందుకు వచ్చి మార్గనిర్దేశనం చేయవలసిన అవసరం ఉన్నది. అయితే, శక్తిమంతమైన మూలాలు ఉన్న మన సమాజం ఈ అసహనాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అయితే, రచయితలు, కళాకారులు ఈ విషయంలో క్రియాశీల భూమిక నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
(‘‘తెలుగులో మళ్లీ కచ్చితంగా సినిమా తీస్తాను. అవకాశం ఉంటే, ‘అంటరాని వసంతం’ని తెరకెక్కిస్తా’’నని సభానంతర సంభాషణలో చెప్పారు ఘోష్.)
(సెప్టెంబర్ 25న ‘ప్రాతినిధ్య-2015’ ఆవిష్కరణ సభలో దర్శకుడు గౌతమ్ ఘోష్ చేసిన ప్రసంగం. పాఠం: జి.కిరణ్ కుమార్)
ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం
Published Mon, Oct 3 2016 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement