పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమౌతాయంటారు కదా, మరి వాటి వైఫల్యాలను ఎక్కడ, ఎలా నిర్ణయిస్తారో తెలుసా? నరకంలో..! అవును నిజం! ఎందుకంటే పవిత్రమైన వైవాహిక బంధం విఫలమైతేగనక వారితోబాటు వారి పిల్లలు, వారిపైన ఆధారపడిన వారు కూడా రకర కాల సామాజిక ఇబ్బందుల రూపేణా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒకప్పటి కాలంలో భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా విడాకుల దాకా వెళ్లకుండా ఓపిగ్గా సర్దుకుపోయేవారు.
ప్రస్తుత కాలంలో మాత్రం విడాకులు లేదా చట్టబద్ధంగా విడిపోవడం సర్వసాధారణమైపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, భర్తల నుంచి విడిపోతున్న భార్యలకన్నా, నయానో, భయానో, బెదిరించో విడాకుల రూపేణా భార్యలను వదిలించుకుంటున్న పురుషులే ఎక్కువమంది ఉండటం! భర్త నిరాదరణకు, అత్తమామల ఛీత్కరింపులకు గురై, వారే ఆమెను ఎలాగోలా వదలించుకున్న సందర్భాలే అధికం. సదరు స్త్రీ విద్యావంతురాలూ, ఉద్యోగస్థురాలూ అయితే, ఇతరుల మీద అంతగా ఆధారపడవలసిన అవసరం ఉండదు. అదే, అసలు ఆమె ఏమీ చదువుకోనిదీ, సంపాదన లేనిదీ అయితే..? ఆమె పరిస్థితి వర్ణనాతీతమే కదా! అటువంటి వారికోసం ఢిల్లీకి చెందిన అదనపు జిల్లా జడ్జి స్వర్ణకాంత శర్మ అందించిన అక్షర సహకారమే ‘డైవోర్స్’ అనే పుస్తకం. ‘విడిపోయినా విలపించనక్కర్లేదు’ అనేది దీనికి ట్యాగ్లైన్. వైవాహిక జీవితం విచ్ఛిన్నమై, ఏ ఆసరా లేక దిక్కుతోచని స్త్రీల పాలిట చీకట్లో చిరుదీపం లాంటిది ఈ పుస్తకం. న్యాయమూర్తిగా పని చేసిన అనుభవంతో ఆమె రాసిన ఈ పుస్తకం వివిధ కారణాలతో భర్త నుంచి చట్టరీత్యా విడిపోయిన స్త్రీలకు, భర్త నిరాదరణకు గురై, పిల్లలను పెట్టుకుని ఒంటరి పోరాటం చేస్తున్న అబలలకు భరోసా ఇస్తూ, వారికి ధైర్యంగా జీవించడమెలాగో నేర్పుతూ, కొండంత అండగా నిలిచే ఈ పుస్తకం ఇప్పటికే మూడు ముద్రణలు పూర్తి చేసుకుని, నాలుగో ముద్రణకు సిద్ధమైంది.
ఒంటరి ఆడవాళ్లు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రతికూలతలనే అనుకూలతలుగా మలచుకుంటూ, స్వతంత్రంగా, ధైర్యంగా జీవించడమెలాగో తెలియజెప్పే ఈ పుస్తకం ఒకవిధంగా ఒంటరి స్త్రీల పాలిట చింతామణి వంటిది. ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ భాషలలో లభ్యమవుతున్న ఈ పుస్తకం త్వరలోనే తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లోకీ అనువాదం కావాలని ఆశిద్దాం.
విడిపోయినా... ధైర్యాన్ని వీడనక్కర్లేదు
Published Tue, Sep 9 2014 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement