అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇప్పటికే నిరూపించుకున్న ఇండియన్స్ ప్రభుత్వ ఉన్నత పదవుల్లోనూ పాగా వేస్తున్నారు. అమెరికా సర్కారులో పదవులు దక్కించుకుంటున్న ఎన్నారైల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా 2013 ప్రవాసులకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు సంఖ్యలో ఎన్నారైలకు వైట్హౌస్లో పదవులు దక్కడం విశేషం.
అమెరికాలో 30 లక్షలకు పైగా జనాభాతో బలమైన వర్గంగా విరాజిల్లుతున్న భారతీయులకు అధ్యక్ష భవనంలో ఈ ఏడాది సముచిత రీతిలో పదవులు దక్కాయి. 50 మందిపైగా ఎన్నారైలు శ్వేతసౌధంలో పదవులు దక్కించుకున్నారు. ఇందులో 12 మందిపైగా కీలక స్థానాల్లో కొలువుదీరారు. వైట్హౌస్లో ఇంతమందికి ముఖ్యమైన పదవులు ఇదే తొలిసారి. ఒబామా సర్కారులో ఐదుగురు ఇండియన్-అమెరికన్స్ అత్యంత కీలక స్థానాల్లో ఉన్నారు. వీరి నియామకానికి సెనేట్ ఆమోదం కూడా లభించింది.
యూఎస్ ఎయిడ్ సారథిగా కొనసాగుతున్న రాజీవ్ షా అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఎన్నారై. ఈ ఏడాది జరిగిన నియామకాల్లో నిషా దేశాయ్ బిశ్వాల్ ముఖ్యమైనది. అమెరికా విదేశాంగ శాఖ(దక్షిణాసియా వ్యవహారాలు) సహాయమంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఆమెకు సహాయకుడిగా అతుల్ కశ్యప్ను ఇటీవల నియమించారు. అజిత రాజీవ్(వైట్హౌస్ ఫెలోషిప్పై అధ్యక్ష కమిషన్లో సభ్యురాలు), ఇస్లాం సిద్ధిఖీ(చీఫ్ అగ్రికల్చర్ నెగోషియేటర్), వినయ్ తుమ్మలపల్లి(బెలీజ్ రాయబారి) సెనేట్ ఆమోదంతో ఉన్నత పదవులు అలంకరించారు. వినయ్ తుమ్మలపల్లి ప్రవాసాంధ్రుడు కావడం విశేషం. యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ నియామకానికి ఇటీవలే సెనేట్ ఆమోదం తెలిపింది.
బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి ఏడాదే ఎన్నారైలకు అధిక సంఖ్యలో పదవులు కట్టబెట్టారు. భారతీయులు తెలివైన వారని, కష్టపడి పనిచేస్తారని ఆయనకు సదాభిప్రాయం ఉంది. సమయం దొరికినప్పుడల్లా భారతీయులను ఆయన ప్రశంసిస్తుంటారు. తమ దేశ వ్యాపార, విద్య, శాస్త్రీయ రంగాల్లో ఇండియన్స్ పాత్ర ఎంతో ఉందని చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. ఈ సారి మిస్ అమెరికా కిరీటాన్ని గెల్చుకున్నారని మెచ్చుకున్నారు. మిస్ అమెరికా కిరీటాన్ని తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ ఏడాది గెల్చుకున్న సంగతి తెలిసిందే.
వైట్హౌస్లో ఎన్నారైల హవా!
Published Mon, Dec 30 2013 8:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement