ప్రకృతిలోని పంచభూతాల తత్వాన్ని సంగీతం ద్వారా శ్రోతలకు అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘పంచతత్వ’ కార్యక్రమం శనివారం నగరంలో ఏర్పాటు కానుంది. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్ఖాన్, పండిట్ విశ్వమోహన్ భట్, సెల్వ గణేశ్, తౌఫిక్ ఖురేషీ, రతన్మోహన్ శర్మ, శుభంకర్ బెనర్జీ, శ్రీధర్ పార్థసారథి వంటి ఉద్దండులు ఈ కార్యక్రమంలో తమ సంగీతంతో నగరవాసులను ఓలలాడించనున్నారు. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముంబై, అహ్మదాబాద్లలో నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించనున్నారు. ‘పంచతత్వ’ నిర్వహణ కోసం ఇక్కడకు వచ్చిన దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమం గురించి కొద్దిసేపు
‘సిటీప్లస్’తో ముచ్చటించారు...
స్వచ్ఛభారత్కు సంగీతపరమైన కొనసాగింపు..
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్స్కేప్, శ్లోకాలతో ప్రకృతిలోని పంచభూతాలను ప్రతిబింబించే ప్రదర్శన ఇది. సంగీతంలో మహామహులైన విద్వాంసులతో పాటు పలువురు సమకాలీన సంగీత విద్వాంసులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ అభియాన్కు సంగీతపరంగా ఇది మా కొనసాగింపు. దీని ద్వారా మానసిక పరిశుద్ధత కలుగుతుందని నేను, నా సహచరుడు నీరజ్ జైట్లీ విశ్వసిస్తున్నాం. దేశంలోని ఐదు నగరాల్లో ‘పంచతత్వ’ కార్యక్రమాన్ని తలపెట్టాం. ముంబైలో నిర్వహించిన తొలి కచేరీని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్జవదేకర్ ప్రారంభించారు. తర్వాత అహ్మదాబాద్లో నిర్వహించాం. అంతకు ముందు ఒమన్లోని మస్కట్లో నిర్వహించాం. మస్కట్లోని రాయల్ ఒపేరా హౌస్లో నిర్వహించిన తొలి భారతీయ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మొత్తం నలభై మంది కళాకారులం దాదాపు రెండు నెలల పాటు దీని రూపకల్పనలో శ్రమించాం. సంగీతంతో మానవుల మనసులను శుభ్రపరచడంతో పాటు ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తున్నాం.
నగరంతో అనుబంధం
మా నాన్న జస్రాజ్ ద్వారా హైదరాబాద్ నగరంతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇది గొప్ప నగరం. తెలంగాణ సంస్కృతి అద్భుతమైనది. ఇక్కడి సంస్కృతిలో మనిషిని క్షణాల్లోనే ఆనందపరచే శక్తి ఉంది. నా లక్ష్యం కూడా సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడమే. నా క్రతువులో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
- కోన సుధాకర్రెడ్డి
నేడు పంచతత్వ
వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్
సమయం: సాయంత్రం 6.30 గంటలకు
ప్రత్యేకత: ప్రకృతి-పంచభూతాల తత్వాన్ని ఉద్దండులైన పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్ఖాన్, విశ్వమోహన్భట్, తౌఫిక్ ఖురేషి, సెల్వ గణేష్, రతన్మోహన్శర్మ, శ్రీధర్ పార్థసారథి, శుభంకర్ బెనర్జీ, అంకితా జోషి, దుర్గా జస్రాజ్ తదితరులు సంగీతరూపంలో ప్రదర్శిస్తారు.
పంచభూతాలకు సప్తస్వర నీరాజనం
Published Sat, Jan 3 2015 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement