ఒకప్పటి తన రాజకీయ గురువు అయిన పెన్మత్స సాంబశివరాజును చిన్నచూపు చూసిన ఫలితం పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. ఉరఫ్ సత్తిబాబుకు ఇప్పుడు తెలిసొస్తోంది. నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించి, సాంబశివరాజును ఒకప్పుడు తీవ్రంగా అవమానించిన బొత్సకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరితే, తాజాగా బొత్స మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కూడా అదే బాటలో నడిచారు. వీరిద్దరి చేరిక వెనుక సాంబశివరాజే ఉన్నారని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడి లాంటి సాంబశివరాజు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు ఇప్పించి, ఒక రకంగా విజయనగరం జిల్లా మొత్తమ్మీద తన కుటుంబ ఆధిపత్యాన్ని చాటాలన్న తపన బొత్స సత్యనారాయణకు చాలా రోజుల నుంచే ఉంది. జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేస్తున్న ఆయన భార్య ఝాన్సీ లక్ష్మిని ఎంపీ పదవికి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశిస్తే, మళ్లీ జడ్పీ పదవిని తన కుటుంబానికే ఇవ్వాలన్న షరతుతో అప్పట్లో బొత్స అంగీకరించారు. అలాగే, చీపురుపల్లి స్థానాన్ని తనకు తానుగా ఇచ్చిన మీసాల నీలకంఠం నాయుడితో ఎచ్చెర్ల కూడా ఖాళీ చేయించారు. ఒకరకంగా ఆయనను అవమానించి, ఈసారికి పోటీ నుంచి తప్పిద్దామనుకున్న బొత్సకు.. నీలకంఠం నాయుడు గట్టి షాకే ఇచ్చారు.
పోటీ మాత్రమే విరమించుకుంటారనుకున్న నాయుడు ఏకంగా పార్టీనే వీడిపోవడంతో బొత్స తీవ్ర ఆందోళన చెందారు. కోల్పోతున్న పట్టును నిలబెట్టుకోడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికీ ఏమాత్రం స్పందన కనిపించలేదు.
Related news
-
షర్మిల ఆడియో లీక్
షర్మిల ఆడియో లీక్ -
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను తమ బానిసలు అని కాంగ్రెస్ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. -
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
నల్లమల నాయకుడెవరు?
సాక్షి, నాగర్కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్కర్నూల్పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ పట్టు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పోతుగంటి భరత్ప్రసాద్ బీజేపీబలం పెంచుకున్న బీజేపీ.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్ప్రసాద్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. మల్లు రవి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్రెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవీ ప్రభావితం చూపే అంశాలుసాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లుటీఆర్ఎస్: పోతుగంటి రాములుఓట్లు: 4,99,672 – 50.48 శాతంకాంగ్రెస్: మల్లు రవిఓట్లు: 3,09,924 – 31.31 శాతంబీజేపీ: బంగారు శ్రుతిఓట్లు: 1,29,021 – 13.03 శాతం -
Lok sabha elections 2024: సీట్లు రెండే... పోటీ సయ్యారే !
సాగర తీర పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గోవాలో రాజకీయాలు అనిశి్చతిమయం. నేతల పార్టీ ఫిరాయింపులు ఇక్కడ పరిపాటి. దేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచి్చనా గోవా మాత్రం 1961 దాకా పోర్చుగీసు పాలనలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1987లో రాష్ట్ర హోదా పొందింది. దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనా కొత్త కూటములు, కొత్త పార్టీలు, పదేపదే సీఎంల మార్పుకు మారుపేరుగా మారింది. కొందరు రెండు మూడు విడతలు పాలించగా, మరికొందరు నెల రోజులు కూడా సీఎంగా కొనసాగలేదు. ఇక్కడ పోరు జాతీయ పార్టీల చుట్టూనే తిరుగుతున్నా ప్రాంతీయ పారీ్టలూ చక్రం తిప్పుతున్నాయి... గోవాలో రెండు లోక్సభ సీట్లే ఉన్నా ఈ రాష్ట్రాన్ని పారీ్టలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కాంగ్రెస్కు బాగా పట్టున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం నడుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాషాయదళం ఇక్కడి రెండు సీట్లనూ దక్కించుకుని సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పారీ్టగా నిలిచినా బీజేపీ నాటకీయంగా అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), కొత్తగా పుట్టుకొచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2019లో పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. తర్వాత కూడా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస కొనసాగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు దక్కించుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పారీ్టగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పారీ్టలతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్లో ముసలం పుట్టి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఉత్తర గోవా లోక్సభ స్థానం బీజేపీకి, దక్షిణ గోవా కాంగ్రెస్కు కంచుకోటలుగా మారాయి. లోకల్ ఎఫెక్ట్ ‘ఇండియా’ కూటమి దన్నుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితరాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ మోదీ, అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, హిందుత్వ నినాదాలతో బరిలోకి దిగుతోంది. సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపో, కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెజ్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రమాకాంత్ ఖలప్ తలపడుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్కు దన్నుగా ఉంది. ఎంజీపీ వంటి పారీ్టలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి అవకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరంగా మారింది.సర్వేలు ఏమంటున్నాయి... గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి.ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించిన కాంగ్రెస్కు సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపపెట్టు. ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు... అవినీతి, వారసత్వ రాజకీయాలు, సొంత ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఇండియా కూటమి మరోవైపున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గోవా సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. నిజమైన సెక్యులరిజం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. – గోవా ఎన్నికల సభలో ప్రధాని మోదీఅధికారంలోకి వస్తే గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మూడు నెలల్లో ప్రారంభిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చనందుకు గోవా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నదుల అనుసంధానం పేరుతో మా నదులపై కేంద్రం పెత్తనం చేస్తోంది. వాటి పేర్లు మార్చేస్తోంది. గోవా గుర్తింపు, సంస్కృతిని నావనం చేస్తోంది. – ఎన్నికల ర్యాలీలో గోవా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పాట్కర్ – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 2nd May..మహాసేన రాజేష్కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్ రెబల్గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి పచ్చ మంద కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్దారులు -
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
48 గంటలు నిషేధిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తరు: కేసీఆర్
సాక్షి, మహబూబాబాద్: ‘‘నా మీద ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయవద్దని నిషేధం విధించింది. అందరికీ మనవి చేస్తున్నా.. రేవంత్రెడ్డి నన్ను ఉద్దేశించి.. నీ పేగులు మెడలో వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టలేదు. నామీద నిషేధం పెట్టింది. 48 గంటలు నా ప్రచారం నిషేధిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు 96 గంటలు అవిశ్రాంతిగా పనిచేస్తరు..’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ఉన్నదే తెలంగాణ కోసం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లకాలంలో తెలంగాణ ఎలా ఉండేది? కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది. ఊరుకునే ప్రసక్తే లేదు.. సాగునీరు, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆగమైంది. ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించారు. ఇంత జరిగినా సీఎం రేవంత్రెడ్డి నోరు మెదపడం లేదు. వారేం చేస్తారో.. రాష్ట్రానికి ఏ నష్టం తీసుకొస్తారో..! ఎంతకాలం చూస్తాం? రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. అరచేతిలో వైకుంఠం చూపించి.. ఎన్నికల సమయంలో ఇది ఇస్తాం.. అది ఇస్తామంటూ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసింది. ఒక్క ఉచిత బస్సు మినహా మరేదైనా వచ్చిందా? రైతుబంధు లేదు. కల్యాణలక్ష్మి లేదు. తులం బంగారం లేదు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన చొప్ప దొండి రైతు అక్కడ ఇబ్బందులకు తట్టుకోలేక గుండె ఆగి చనిపోయారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది పదేళ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చింది.. కరువు వచ్చింది. సాగు, తాగునీరు లేక రాష్ట్రం ఎడారిగా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో మురికి నీరు తాగుతున్నారు. మహ బూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గా ల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కరెంట్, మిషన్ భగీ రథ నీళ్లు ఎటుపోయాయి? ఆటో కార్మీకుల జీవితాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.గిరిజనులను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్సే..తరతరాలుగా వెనుకబడిన గిరిజనులను అక్కున చేర్చుకుని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు నిధులు కేటాయించింది. ఏడు దశాబ్దాలుగా ఏ పార్టీ చేయని విధంగా వారి అస్తిత్వానికి నిదర్శనమైన సేవాలాల్ బంజారా భవనం కట్టుకున్నాం. రిజర్వేషన్ పెంచి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాం. బీఆర్ఎస్కు గిరిజనులు, ఆదివాసీలు అండగా ఉండాలి. ప్రతీ క్షణం, ప్రతీ అడుగు, ప్రతీ మాట ప్రజల కోసమే పనిచేసే బీఆర్ఎస్ను దీవించాలి. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు 48 గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మే ఒకటో తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు. దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి 7.45 గంటలలోపు ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్.. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో.. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఏప్రిల్ 5న ‘పొలం బాట’పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నేత కార్మీకులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 చొప్పున బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ను వేటాడతామంటూ మాట్లాడారు. ఇలా సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్.. ఏప్రిల్ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్పై కేసీఆర్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరిపి ఏప్రిల్ 10న నివేదిక సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్కు ఏప్రిల్ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘విలేకరుల సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్చార్జులుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు. నేను చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తప్పుగా అనువదించడంతోపాటు వక్రీకరించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాలు, పథకాలను మా త్రమే విమర్శించాను’’అని కేసీఆర్ ఈసీకి సమా ధానం ఇచ్చారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో, 2023 అక్టోబర్లో బాన్సువాడ సభలో చేసిన వ్యాఖ్యలపైనా హెచ్చరికలు చేశామని గుర్తు చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. సీఎం రేవంత్పై బీఆర్ఎస్ ఫిర్యాదు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని, ఆయనపై చ ర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్ల మూసివేతకు సంబంధించి గతేడాది మే 12న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లోని అంశాలను వక్రీకరిస్తూ.. నకిలీ సర్క్యులర్ను ఉద్దేశపూర్వకంగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు రేవంత్రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుయాత్ర రీ షెడ్యూల్పై కసరత్తు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల బస్సుయాత్రను కేసీఆర్ చేపట్టారు. మిర్యాలగూడలో మొదలైన యాత్ర వరుసగా 8 రోజుల పాటు సాగి బుధవారం రాత్రి మహబూబాబాద్కు చేరుకుంది. కానీ ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు బస్సుయాత్రను నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం.. కేసీఆర్ బుధవా రం రాత్రి వరంగల్లో బస చేసి.. గురువారం జమ్మి కుంట, వీణవంకలలో, శుక్రవారం రామగుండంలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధం నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మార్పులపై గురువారం స్పష్టత ఇస్తామని ప్రకటించింది.తెలంగాణ గొంతుపై నిషేధమా?: కేటీఆర్కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుపట్టారు. ‘ఎక్స్’వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు.‘‘ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు కేసీఆర్పైనే నిషేధమా? ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్కు కమిషన్కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు లు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్కు ప్రవచనాల్లా అనిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎం రేవంత్పై ఎలాంటి చర్యలూ ఉండవా? బడే భాయ్.. చోటే భాయ్ కలసి చేసిన కుట్ర కాదా ఇది. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణికిపోతున్నాయి? మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వి నియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానం ఇస్తారు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రశ్నిస్తే ప్రచారం వద్దంటున్నారు: హరీశ్రావు‘‘కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్ గట్టిగా కొట్లాడుతున్నారనే రెండు రోజులు ప్ర చారం ఆపారు. మోదీ మత విద్వేషాలు రెచ్చ గొడితే.. రేవంత్ బూతులు మాట్లాడితే ఎన్ని కల కమిషన్కు కనిపించవా? ప్రశ్నించే కేసీఆర్ను మాత్రం ప్రచారం చేయొద్దు అంటు న్నారు. రెండు రోజులు కేసీఆర్ ప్రచారం ఆగినంత మాత్రం జరిగేదేంటి?’’అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటారని చెప్పా రు. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ గజగజ వణుకుతున్నాయన్నారు. కేసీఆర్ అంతటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్న రేవంత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement